మెసాయిద్లో అంతర్జాతీయ స్థాయి పబ్లిక్ పార్క్ ప్రారంభం
- April 25, 2024దోహా: మునిసిపాలిటీ మంత్రిత్వ శాఖ (MoM) మెసాయిద్లో అంతర్జాతీయ స్థాయి పబ్లిక్ పార్క్ ను ప్రారంభించింది. ఇందులో జాగింగ్ ట్రాక్లు, ప్లేగ్రౌండ్లు, ల్యాండ్స్కేప్ మరియు స్థానిక చెట్లతో సహా అవసరమైన అన్ని సౌకర్యాలతో 38,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో పబ్లిక్ పార్క్ విస్తరించి ఉంది. పురపాలక శాఖ మంత్రి హెచ్ఈ అబ్దుల్లా బిన్ హమద్ బిన్ అబ్దుల్లా అల్ అత్తియా పార్కును ప్రారంభించారు. ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించడానికి ప్రజలను ప్రోత్సహించడానికి మంత్రిత్వ శాఖలోని పబ్లిక్ పార్క్స్ డిపార్ట్మెంట్ నిర్మించిన అతి ముఖ్యమైన పార్కులలో ఇది ఒకటని తెలిపారు. “మంత్రిత్వ శాఖ తన భవిష్యత్ ప్రణాళికల్లో భాగంగా కొత్త పార్కులను ప్రారంభించే ప్రణాళికలు ఉన్నాయి. పబ్లిక్ పార్కులు, ప్లాజా మరియు కార్నిచ్ల సంఖ్య దాదాపు 144కి చేరుకుంది.” అని మంత్రి తెలిపారు.
దాదాపు 38,029sqm విస్తీర్ణంలో ఉన్న పబ్లిక్ పార్క్లో 676 మీటర్ల పొడవు గల రబ్బర్ ఫ్లోర్తో కూడిన వాక్వే ఉంది. 11,316 sqm పచ్చటి ప్రాంతాలు సహజమైన గడ్డి, చెట్లు మరియు తాటి చెట్లతో ఉంటాయి. పార్క్లో మూడు ఫుట్బాల్ మైదానాలు కూడా ఉన్నాయి. 553 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఒక బాస్కెట్బాల్ కోర్ట్, 667 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఒక టెన్నిస్ కోర్ట్ మరియు మొత్తం 350 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఆరు ఇల్యూమినేటెడ్ పెర్గోలాలు ఉన్నాయి. 132 కార్లు పట్టే పార్కింగ్ స్థలం ఉంది.
తాజా వార్తలు
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్పోర్టులో కలకలం