ఒబామాతో మోదీ భేటీ
- June 07, 2016
భారత ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం రాత్రి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాతో భేటీ అయ్యారు. వైట్ హౌస్ కు చేరుకున్న ప్రధాని మోదీని అమెరికా అధ్యక్షుడు ఆత్మీయ ఆలింగనం చేసుకుని ఘన స్వాగతం పలికారు. భారత్ లో గణతంత్ర్య దినోత్సవ వేడుకలలో తాను పాల్గొన్న రోజులను ఈ సందర్భంగా ఒబామా గుర్తు చేసుకున్నారు. అమెరికాతో కలిసి పని చేయడానికి సిద్ధమని, ఎన్నో సమస్యలపై పోరాడతామని మోదీ పేర్కొన్నారు.
పలు సమస్యలపై ఒబామాతో చర్చించామని, తనను ఇక్కడకు ఆహ్వానించినందుకు మోదీ కృతజ్ఞతలు తెలిపారు. భారత్ యంగ్ కంట్రీ అని, దేశంలో 80 కోట్ల జనాభా 35 ఏళ్లలోపు వారేనని చెప్పారు. దేశ యువకులు అమెరికాతో కలిసి పనిచేస్తే ఎన్నో అవకాశాలు లభిస్తాయన్నారు.
పౌర అణు సహకారం, ప్రాంతీయ సైబర్ సెక్యూరిటీ అంశాలపై చర్చించామని ప్రధాని మోదీ తెలిపారు.
తాజా వార్తలు
- JEE అడ్వాన్స్డ్ 2026 షెడ్యూల్ వచ్చేసింది..
- శ్రీవారిని దర్శించుకున్న సీఎం రేవంత్
- తిరుమల మాదిరిగా యాదగిరిగుట్టలో ప్రత్యేక సేవలు
- మెసైమీర్ ఇంటర్చేంజ్ టన్నెల్ మూసివేత..!!
- దుబాయ్ లో జనవరి 1న పార్కింగ్ ఫ్రీ..!!
- బహ్రెయిన్ లో అమల్లోకి కొత్త ఇంధన ధరలు..!!
- అల్-ముబారకియా నుండి చేపల మార్కెట్ తరలింపు..!!
- ఒమన్ లో 12 మంది ఆఫ్రికన్ జాతీయులు అరెస్..!!
- సౌదీ అరేబియాలో అనుమానాస్పద లింక్ల ధృవీకరణ సర్వీస్..!!
- తెలంగాణ: నాలుగు కమిషనరేట్లు ఏర్పాటు..







