ఖతార్ సరిహద్దులో భారీగా ఆయుధాలు స్వాధీనం
- April 26, 2024దోహా: అబు సమ్రా సరిహద్దు క్రాసింగ్ ద్వారా దేశంలోకి ప్రవేశిస్తున్న వాహనంలో ఆయుధాలు, తుపాకీలను అక్రమంగా తరలించే ప్రయత్నాన్ని ల్యాండ్ కస్టమ్స్ విభాగం అడ్డుకుంది. ఓడరేవుకు చేరుకోగానే వాహనాన్ని వెహికల్ స్కానింగ్ పరికరంతో అధికారులు తనిఖీలు చేశారు. వాహనంలో రహస్యంగా దాచిన మూడు ఆయుధాలు, 1,900 బుల్లెట్లను గుర్తించారు. దేశంలోకి వాహనాలు సురక్షితంగా ప్రవేశించేందుకు వీలుగా జనరల్ అథారిటీ ఆఫ్ కస్టమ్స్ ఇటీవల అబూ సమ్రా సరిహద్దు వద్ద కొత్త తనిఖీ పరికరాలను ప్రవేశపెట్టింది. ఈ పరికరాలు గంటకు 130 కార్లను స్క్రీనింగ్ చేయగలవు. ఒక్కో వాహనానికి సుమారుగా రెండు నిమిషాల చొప్పున ఖతార్లోకి ప్రవేశించకుండా నిషేధించబడిన ప్రమాదకర పదార్థాలను గుర్తించేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఉపయోగిస్తాయి.
తాజా వార్తలు
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..