ఇండియా కాదని చైనాలో పర్యటిస్తున్న ఎలాన్ మస్క్..కారణం ఏంటి?
- April 28, 2024
టెస్లా సీఈవో ఎలాన్ మస్క్.. తన భారత పర్యటనను వాయిదా వేసుకుని చైనాలో పర్యటిస్తున్నారు. వాస్తవానికి ఇండియాలో పర్యటించాల్సింది ఉంది.. కానీ ఆదివారం అకస్మాత్తుగా చైనాను సందర్శించారు.
ఎలక్ట్రిక్ వాహనాల పరంగా చైనా రెండవ అతిపెద్ద మార్కెట్ కలిగి ఉన్న సంగతి తెలిసిందే.. వార్తా సంస్థ రాయిటర్స్ తెలిపిన వివరాల ప్రకారం.. మస్క్ పర్యటనకు సంబంధించిన విషయాలు తెలిసిన ఇద్దరు వ్యక్తులు చెప్పారు.
ఎలోన్ మస్క్ తన ఇండియా పర్యటన వాయిదా పడిన వారం రోజుల తర్వాత చైనా పర్యటనకు వెళ్లారని చెప్పారు. ఇండియాలో అతను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని కలుసుకుని, భారత మార్కెట్లోకి ప్రవేశించే ప్రణాళికలను ప్రకటించవలసి ఉందన్నారు. చైనాలో టెస్లా (Tesla) కార్లకు ఇటీవల గిరాకీ తగ్గింది. పోటీ సంస్థల నుంచి అందుబాటు ధరలో కార్లు మార్కెట్లోకి వచ్చాయి. దీంతో ఇటీవల టెస్లా తమ కార్ల ధరలను గణనీయంగా తగ్గించింది. ఈ తరుణంలో మస్క్ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. ఫుల్ సెల్ఫ్ డ్రైవింగ్ (FSD) సాఫ్ట్వేర్, దేశం యొక్క ఆటోమేటెడ్ డ్రైవింగ్ సాంకేతికత కోసం అల్గారిథమ్లను రూపొందించడం గురించి చర్చించడానికి ఎలోన్ మస్క్ చైనాను సందర్శించినట్లు ఈ విషయంపై అవగాహన ఉన్న ఇద్దరు వ్యక్తులలో ఒకరు చెప్పినట్లు రాయిటర్స్ పేర్కొంది. సేకరించిన డేటాను విదేశాలకు బదిలీ చేయడానికి ఆమోదం పొందేందుకు బీజింగ్లో చైనా సీనియర్ అధికారులతో మస్క్ సమావేశమయ్యారని పేర్కొన్నారు.
ముఖ్యంగా, మస్క్ చైనా పర్యటన ప్రజల దృష్టిలో ప్రముఖంగా కనిపించలేదు. రాయిటర్స్ ప్రకారం, టెస్లా తన చైనీస్ అనుబంధ సంస్థ ద్వారా సేకరించిన మొత్తం డేటాను 2021 నుండి షాంఘైలో చైనీస్ రెగ్యులేటర్లకు అవసరమైన విధంగా నిల్వ చేసింది. చైనా కస్టమర్లకు సంబంధించిన డేటాను దేశం వెలుపలికి తీసుకెళ్లేందుకు అక్కడి ప్రభుత్వం అనుమతించడం లేదు. దీంతో టెస్లా మొత్తం డేటాను అక్కడే స్టోర్ చేస్తోంది. 'ఎఫ్ఎస్డీ'ని ట్రైన్ చేయడం కోసం ఆ డేటా అవసరమవుతుంది. ఈ నేపథ్యంలో చైనా వెలుపలికి డేటాను బదిలీ చేసే అంశంపై కూడా మస్క్ ప్రభుత్వంతో చర్చించనున్నట్లు సమాచారం. త్వరలో ఎఫ్ఎస్డీని చైనాలో అందుబాటులోకి తీసుకొస్తామని మస్క్ ఇటీవల స్వయంగా తెలిపారు.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు