భారీ వర్షాల తర్వాత 30% పెరిగిన ప్రీమియంలు..!
- May 01, 2024
యూఏఈ: ఏప్రిల్ 16న భారీ వర్షాల తర్వాత యూఏఈలోని బీమా కంపెనీలు ప్రీమియంలను 30 శాతం వరకు పెంచాయి. సమగ్ర బీమా కోసం డిమాండ్ మరియు ప్రీమియంలు కూడా పెరిగాయని, వాటిలో కొన్ని వర్షానంతర కాలంలో 100 శాతం పెరిగాయని బీమా రంగ నిపుణులు తెలిపారు. ఎందుకంటే థర్డ్-పార్టీ లయబిలిటీ (TPL) వాహనాలు, గృహాలకు సంభవించే ప్రకృతి విపత్తుల నష్టాలను కవర్ చేయదని పేర్కొన్నారు. ఖరీదైన ప్యాకేజీలను ఎంచుకోమని యజమానులకు సూచించారు. యూఏఈ 75 సంవత్సరాలలో ఏప్రిల్ 16న భారీ వర్షాన్ని నమోదు చేసింది. దీని ఫలితంగా దేశంలోని అనేక ప్రాంతాలు, ముఖ్యంగా దుబాయ్, షార్జా మరియు అజ్మాన్లలో వరదలు సంభవించాయి. కొన్ని సంస్థలు క్లెయిమ్లలో 400 శాతం జంప్ను నివేదించడంతో వర్షం సమయంలో జరిగిన నష్టాలకు వ్యతిరేకంగా బీమా కంపెనీలు వాహనం, ఇంటి క్లెయిమ్లు పెరిగిపోయాయి. యూఏఈలో బుధవారం సాయంత్రం నుండి ప్రారంభమయ్యే ఈ వారంలో మళ్లీ రెండు రోజుల పాటు మధ్యస్థం నుండి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని ఇప్పటికే హెచ్చరికలు జారీ అయిన విషయం తెలిసిందే. Policybazaar.aeలో హెల్త్ అండ్ మోటర్ ఇన్సూరెన్స్ బిజినెస్ హెడ్ తోషితా చౌహాన్ మాట్లాడుతూ.. భారీ వర్షాల తర్వాత బీమా రేట్లు 5 నుండి 20 శాతం వరకు పెరగడాన్ని తాము గమనించామని చెప్పారు. గత వారాలతో పోలిస్తే క్లెయిమ్లు దాదాపు 200 శాతానికి పైగా ఎక్కువగా ఉన్నాయని తెలిపారు. సెలూన్లు మరియు స్పోర్ట్స్/కూపే కార్లు ముఖ్యంగా ప్రీమియం పెంపుదల యొక్క అధిక ప్రభావాన్ని చూస్తాయని చౌహాన్ పేర్కొన్నారు. వర్షాల కారణంగా యూఏఈలోని కొన్ని బీమా కంపెనీలు ప్రిమియం రేట్లు పెంచాయని యూనిట్రస్ట్ ఇన్సూరెన్స్ బ్రోకర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మొయిన్ ఉర్ రెహ్మాన్ వెల్లడించారు. కాంటినెంటల్ గ్రూప్లో ఉపాధి ప్రయోజనాలు మరియు సాధారణ బీమా వైస్ ప్రెసిడెంట్ ఫైసల్ అబ్బాస్ కూడా మూడవ త్రైమాసికంలో లేదా ఈ సంవత్సరం నాల్గవ త్రైమాసికంలో ప్రీమియంలు పెరుగుతాయని స్పష్టం చేశారు. వరదల ఘటన తర్వాత సమగ్ర మోటార్ బీమా డిమాండ్ దాదాపు రెట్టింపు అయిందని అబ్బాస్ వెల్లడించారు.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు