రమదాన్ తొలిరోజు: 5 గంటలు 250 ప్రమాదాలు
- June 08, 2016
పవిత్ర రమదాన్ మాసంలో తొలి రోజున కేవలం 5 గంటల్లోనే మొత్తం 250 ప్రమాదాలు చోటుచేసుకున్నాయని దుబాయ్ పోలీస్ వర్గాలు వెల్లడించాయి. కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ఆఫ్ దుబాయ్ పోలీస్, తొలి రోజు 2419 ఫోన్ కాల్స్ని అందుకుంది. 250 ప్రమాదాలకు సంబంధించిన సమాచారాన్ని కమాండ్ కంట్రోల్ సెంటర్కి తెలియజేశారు. డైరెక్టర్ లెఫ్టినెంట్ కల్నల్ కజ్రాజ్ మజీద్ అల్ కజ్రాజి ఈ విషయాల్ని వెల్లడించారు. ఇతర వాహనాలతో తగినంత దూరం రోడ్లపై పాటించాల్సిందిగా వాహనదారులకు విజ్ఞప్తి చేసిన కజ్రాజ్ మజీజ్, వేగ నియంత్రణపై శ్రద్ధ అవసరమని సూచించారు. అలాగే, చిన్న చిన్న విషయాల కోసం ఎమర్జన్సీ ఫోన్కాల్ డిపార్ట్మెంట్ని ఇబ్బంది పెట్టవద్దనీ, తద్వారా ఎమర్జన్సీ సర్వీసులకు ఆటంకం కలుగుతుందన్నారు. రస్ అల్ ఖైమాలో ఓ మహిళ రోడ్డు దాటుతుండగా, ప్రమాదానికి గురై చనిపోయిందని పోలీసులు తెలిపారు. రోడ్లు దాటేటప్పుడు పాదచారులు అప్రమత్తంగా ఉండాలని వారు కోరారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







