తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
- May 02, 2024
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. వేసవి సెలవులు కావడంతోపాటు.. ఇంటర్, టెన్త్ పరీక్షల ఫలితాలు వెలువడటంతో తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య పెరిగింది. పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన పలువురు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు స్వామివారి మొక్కులు తీర్చుకునేందుకు తిరుమలకు వస్తున్నారు. దీంతో తిరుమల కొండపై భక్తుల రద్దీగా పెరిగింది.
తిరుమల తిరుపతి దేవస్థానం వివరాల ప్రకారం.. బుధవారం శ్రీవారిని 72,510 మంది భక్తులు దర్శించుకోగా.. శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.62 కోట్లు. తిరుమలలో భక్తులు రద్దీ పెరగడంతో.. 12 కంపార్ట్ మెంట్లు నిండి వెలుపల క్యూలైన్లలో భక్తులు వేచిఉన్నారు. టోకెన్లు లేకుండా శ్రీవారి సర్వదర్శనానికి 16గంటల సమయం పడుతుంది.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు