అరటి పండు తింటే బీపీ కంట్రోల్లో వుంటుందా.?
- May 02, 2024
పండ్లలో రారాజుగా పేర్కొంటాం అరటి పండుని. సీజన్లతో పని లేకుండా, అన్ని వర్గాల వారికీ ఎప్పుడూ అందుబాటులో వుండే ఫలం అరటి పండు. తక్కువ ఖర్చుతో విరివిగా లభించే ఈ అరటి పండులో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయ్.
అరటి పండులో మెగ్నీషియం, పొటాషియం, పాస్పరస్ పుష్కలంగా వుండడంతో పాటూ, కార్భో హైడ్రేట్లూ, విటమిన్లు కూడా అధికంగా వుంటాయ్.
పాస్ఫరస్ అధికంగా వుండడం వల్ల అధిక రక్తపోటు సమస్య వుండదు. తద్వారా బీపీ కంట్రోల్లో వుంటుంది. గుండె జబ్బులు దరి చేరవు.
అంతేకాదు, విటమిన్ ఏ, బీ 6 అరటి పండులో ఎక్కువగా వుండడం వల్ల చర్మ సౌందర్యం కూడా వృద్ధి చెందుతుంది. దీనిలోని ఫైబర్ మలబద్ధకం సమస్యను తీరుస్తుంది.
అరటి పండులోని కేలరీలు అధికంగా వుండడం వల్ల ఒక్క పండు తింటే చాలు కడుపు నిండిన ఫీలింగ్ వస్తుంది. తక్షణ శక్తి కూడా లభిస్తుంది. అందుకే బరువు తగ్గాలనుకునేవారు అరటి పండును క్రమం తప్పకుండా తినొచ్చు.
రాత్రి పూట అరటి పండు తింటే దగ్గు, జలుబు వస్తాయని కొందరిలో అపోహలున్నాయ్. కానీ, అవి కేవలం అపోహలు మాత్రమే అని నిపుణులు చెబుతున్నారు. అంతే కాదండోయ్ మానసిక స్థితి సరిగ్గా లేని వారికి అరటి పండు ఓ దివ్యౌషధంగా చెబుతున్నారు.
తాజా వార్తలు
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!
- బహ్రెయిన్-బ్రిటన్ మధ్య కీలక చర్చలు..!!
- షార్జాలో మిస్సింగ్.. కజకిస్థాన్ అక్కాచెల్లెళ్లు అనుమానస్పద మృతి..!!
- నేపాల్కు ఖతార్ అత్యవసర సాయం.. భూకంపాలు, వరద బాధితులకు అండగా రెస్క్యూ బృందాలు
- పుతిన్తో ప్రధాని మోదీ భేటీ.. భారత్–రష్యా సంబంధాల పై కీలక చర్చలు
- అంతర్జాతీయ ఫుట్బాల్కు లియోనెల్ మెస్సీ వీడ్కోలు.. అర్జెంటీనా జట్టుకు గుడ్బై
- ఈజిప్ట్కు చేరుకున్న భారత వాయుసేన ‘సారంగ్’ హెలికాప్టర్ డిస్ప్లే టీమ్







