అరటి పండు తింటే బీపీ కంట్రోల్లో వుంటుందా.?
- May 02, 2024
పండ్లలో రారాజుగా పేర్కొంటాం అరటి పండుని. సీజన్లతో పని లేకుండా, అన్ని వర్గాల వారికీ ఎప్పుడూ అందుబాటులో వుండే ఫలం అరటి పండు. తక్కువ ఖర్చుతో విరివిగా లభించే ఈ అరటి పండులో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయ్.
అరటి పండులో మెగ్నీషియం, పొటాషియం, పాస్పరస్ పుష్కలంగా వుండడంతో పాటూ, కార్భో హైడ్రేట్లూ, విటమిన్లు కూడా అధికంగా వుంటాయ్.
పాస్ఫరస్ అధికంగా వుండడం వల్ల అధిక రక్తపోటు సమస్య వుండదు. తద్వారా బీపీ కంట్రోల్లో వుంటుంది. గుండె జబ్బులు దరి చేరవు.
అంతేకాదు, విటమిన్ ఏ, బీ 6 అరటి పండులో ఎక్కువగా వుండడం వల్ల చర్మ సౌందర్యం కూడా వృద్ధి చెందుతుంది. దీనిలోని ఫైబర్ మలబద్ధకం సమస్యను తీరుస్తుంది.
అరటి పండులోని కేలరీలు అధికంగా వుండడం వల్ల ఒక్క పండు తింటే చాలు కడుపు నిండిన ఫీలింగ్ వస్తుంది. తక్షణ శక్తి కూడా లభిస్తుంది. అందుకే బరువు తగ్గాలనుకునేవారు అరటి పండును క్రమం తప్పకుండా తినొచ్చు.
రాత్రి పూట అరటి పండు తింటే దగ్గు, జలుబు వస్తాయని కొందరిలో అపోహలున్నాయ్. కానీ, అవి కేవలం అపోహలు మాత్రమే అని నిపుణులు చెబుతున్నారు. అంతే కాదండోయ్ మానసిక స్థితి సరిగ్గా లేని వారికి అరటి పండు ఓ దివ్యౌషధంగా చెబుతున్నారు.
తాజా వార్తలు
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- మరో మలేసియా విమానం మిస్సింగ్ 11 మంది పై ఉత్కంఠ!







