పసిడి ధర పెరిగింది

- June 08, 2016 , by Maagulf
పసిడి ధర  పెరిగింది

 రెండు రోజులుగా వరసగా తగ్గిన పసిడి ధర బుధవారం మాత్రం పెరిగింది. రూ.130 పెరగడంతో 99.9శాతం స్వచ్ఛత గల పది గ్రాముల పసిడి ధర రూ.29,160కి చేరింది. దేశీయంగా నగల వ్యాపారులు కొనుగోళ్లు జరపడం, ప్రపంచ మార్కెట్ల ప్రభావంతో దీని ధర పెరిగిందని బులియన్‌ మార్కెట్‌ వర్గాలు తెలిపాయి. అంతర్జాతీయంగా సింగపూర్‌ బులియన్‌ మార్కెట్‌లో ఔన్సు బంగారం ధర 0.73శాతం పెరిగి 1,252.30 యూఎస్‌ డాలర్లకు చేరింది.పసిడి దారిలోనే వెండి సైతం పయనించింది. ఈ ఒక్క రోజే రూ.350 పెరగడంతో కేజీ వెండి ధర రూ.39,500కి చేరింది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారులు కొనుగోళ్లు చేయకపోవడంతో దీని ధర పెరిగిందని బులియన్‌ మార్కెట్‌ వర్గాలు తెలిపాయి.అంతర్జాతీయంగా సింగపూర్‌ బులియన్‌ మార్కెట్‌లో ఔన్సు వెండి ధర 1.71శాతం పెరిగి 16.62 యూఎస్‌ డాలర్లకు చేరింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com