66కు పెరిగిన సౌదీ ఇ-విజిట్ వీసా పూల్ దేశాలు
- May 09, 2024
రియాద్: ఎలక్ట్రానిక్ విజిట్ వీసాలు పొందేందుకు అర్హత ఉన్న దేశాల జాబితాలో మూడు కొత్త దేశాలను చేర్చినట్లు సౌదీ అరేబియా బుధవారం ప్రకటించింది. కొత్త చేరిన దేశాలలో కామన్వెల్త్
కరేబియన్ దేశాలైన బహామాస్, బార్బడోస్ మరియు గ్రెనడా ఉన్నాయి. ఈ విస్తరణతో ఇ-విజిట్ వీసా పాలనలో ఉన్న మొత్తం దేశాల సంఖ్య 66కి చేరుకుంది. సౌదీ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ మరియు పర్యాటక మంత్రిత్వ శాఖ సహకారంతో ఈ మూడు దేశాల పౌరులు దీనికి అర్హులని ప్రకటించింది. ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చే సందర్శకులకు మరపురాని పర్యాటక అనుభూతిని అందించడానికి సౌదీ అరేబియా చేస్తున్న ప్రయత్నాలలో ఈ స్కీమ్ ను ప్రవేశ పెట్టారు. ఈ దేశాల పౌరులకు ఒక సంవత్సరం చెల్లుబాటుతో మల్టీ రీఎంట్రీ ఇ-విజిట్ వీసా మంజూరు చేయబడుతుందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మరిన్ని వివరాలను visitsaudi.com వెబ్సైట్ నుండి పొందవచ్చని మంత్రిత్వ శాఖ తెలిపింది.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్లో అస్సాం రైఫిల్స్పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!