నకిలీ వార్తల భరతం పడుతున్న లాజికల్లీ
- May 14, 2024
ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ మీడియా ఉచ్చ స్థితిలో ఉన్న ఈ సమయంలో మంచి ఎంత జరుగుతుందో చెడు సైతం కూడా అంతే జరుగుతుంది. ఇంక వార్తల విషయానికి వచ్చేసరికి ఏది నమ్మాలో, ఏది నమ్మకూడదో తెలియని పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా కరోనా సమయంలో లెక్కలేనన్ని నకిలీ వార్తలు విపరీతంగా వ్యాపించాయన్నది వాస్తవం.
అయితే ఈ వార్తల్లో నిజమైనవేవో నిగ్గు తేల్చి సామాజిక బాధ్యతను నిర్వర్తించినందుకు నిజ నిర్ధారణ (Fact Checking) వార్తల విభాగంలో అనేక బహుమతులు పొందింది లాజికల్లీ (Logically)యాప్. ఈ ఔత్సాహిక అంకురాన్ని పెట్టింది లిరిక్ జైన్ అనే యువ వ్యాపారవేత్త. 2014 దేశ సార్వత్రిక ఎన్నికల సమయంలో సామాజిక మాధ్యమాల్లో విచ్చలవిడిగా వచ్చిన నకిలీ వార్తల గుట్టురట్టు చేయాలని భావించి 2016లో "లాజికల్లీ" సంస్థను స్థాపించాడు.
మానవ మేధస్సు కు సాంకేతికంగా అభివృద్ధి చెందిన కృత్రిమ మేధస్సు ను జతచేసి నకీల వార్తల పని పడుతున్నాడు. పలు రంగాల్లో నిష్టణుతులైన చాలా మంది నిపుణులు ఈ సంస్థ లో పనిచేస్తున్నారు. ఎన్నికల సమయంలో పలు రాష్ట్రాల ఎన్నికల సంఘాలతో , అక్కడి పోలీసు విభాగాలతో "లాజికల్లీ" కలిసి పనిచేస్తుంది. పోయిన సంవత్సరం జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో సైతం నకిలీ వార్తలను అరికట్టేందుకు ఈ యాప్ ను అక్కడ బాగా ఉపయోగించారు అని సంస్థ వ్యవస్థాపకుడు లిరిక్ జైన్ తెలియజేశారు.
ప్రస్తుతం ఇంగ్లీష్ , హిందీ , మరాఠీ మరియు కన్నడ భాషల్లో మాత్రమే సేవాలందిస్తున్న లాజికల్లీ సంస్థ రానున్న రోజుల్లో దేశంలో ఉన్న ప్రాంతీయ భాషలన్నిట్లోనూ అందుబాటులోకి తెచ్చేందుకు సంస్థ ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. అంతేకాకుండా త్వరలో ఈ యాప్ ప్రత్యేకంగా వాట్సప్ నంబర్ తెచ్చే ప్రయత్నాల్లో కూడా ఉందని సమాచారం. వాట్సప్ లో ఆ నంబర్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎవరైనా తమకు అనుమానం ఉన్న వార్తని ఆ నంబరుకి పంపిస్తే కృత్రిమ మేధా ద్వారా అది నిజమో కాదో చెప్పేస్తుంది. ఒక వేళ నకిలీ వార్త అయితే దాని పుట్టుపూర్వత్రలతో సహా తెలిసిపోతుందట.
భారతదేశంలో రూపొందించిన ఈ మెడిన్ ఇండియా యాప్ కు భారత ప్రభుత్వం నిర్వహించిన ఆత్మనిర్భర్ భారత్ పోటీల్లో ప్రథమ బహుమతి సైతం లభించింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ యాప్ కు బహుళ ఆదరణ లభించాలని సంస్థ ధ్యేయంగా పెట్టుకుంది.ప్రజలకు "లాజికల్లీ" యాప్ ద్వారా నిజమైన సమాచారాన్ని నిరంతరం అందించేందుకు తన వంతు కృషి ఎల్లప్పుడూ ఉంటుంది అని సంస్థ వ్యవస్థాపకుడు లిరిక్ జైన్ స్పష్టం చేస్తున్నారు.
--డి.వి.అరవింద్(మాగల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- టీఆర్ఎస్ చీఫ్ కవితతో బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ భేటీ
- అబూధాబి BAPS హిందూ మందిరానికి ప్రతిష్ఠాత్మక ‘టాలరెన్స్ అవార్డు 2026’
- తెలంగాణ రోడ్లకు రూ.7,597 కోట్లు విడుదల చేసిన కేంద్రం
- కర్ణాటక సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన డీకే శివకుమార్
- ప్రజల విశ్వాసమే పోలీసింగ్కు పునాది: సైబరాబాద్ సీపీ డా.ఎం.రమేష్
- ఇరాన్ దాడి అనంతరం కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని సందర్శించిన ప్రధాని షేక్ అహ్మద్
- క్షిపణుల అడ్డుకట్ట దృశ్యాలు చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వ్యక్తి అరెస్ట్
- క్షతగాత్రులను పరామర్శించిన కువైట్ రక్షణ మంత్రి షేఖ్ అబ్దుల్లా అలీ
- హిజ్రీ నూతన సంవత్సరానికి యూఏఈలో జూన్ 15న సెలవు









