1,300 కంపెనీలకు Dh100,000 జరిమానా..!

- May 17, 2024 , by Maagulf
1,300 కంపెనీలకు Dh100,000 జరిమానా..!

యూఏఈ: 1,300 కంటే ఎక్కువ ప్రైవేట్ కంపెనీలు 2022 మధ్య నుండి మే 16  వరకు ఎమిరేటైజేషన్ నిబంధనలను ఉల్లంఘించినందుకు జరిమానా విధించినట్లు మానవ వనరులు మరియు ఎమిరేటైజేషన్ మంత్రిత్వ శాఖ (మోహ్రే) శుక్రవారం ప్రకటించింది. ఉల్లంఘించిన వారికి ఒక్కో కేసుకు Dh 20,000 నుండి Dh100,000 వరకు జరిమానా విధించబడింది. ఈ 1,379 సంస్థలు 2,170 మంది యూఏఈ పౌరులను అక్రమంగా నియమించుకున్నట్లు తేలిందని మోహ్రే తెలిపారు. దేశంలోని ప్రైవేట్ కంపెనీలు 2026 నాటికి కనీసం 10 శాతానికి చేరుకోవడానికి తమ ఎమిరాటీ వర్క్‌ఫోర్స్ శాతాన్ని ప్రతి సంవత్సరం రెండు శాతం పెంచుకోవాల్సి ఉంటుంది. ఇప్పటివరకు సేకరించిన డేటా ఆధారంగా దేశంలోని దాదాపు 20,000 ప్రైవేట్ కంపెనీల్లో 97,000 మందికి పైగా ఎమిరాటీలు పనిచేస్తున్నారని మోహ్రే తెలిపింది.  Dh100,000 వరకు భారీ జరిమానాలతో పాటు, ఉల్లంఘించిన వారిని పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కు పంపినట్లు వెల్లడించింది.  600590000కు డయల్ చేయడం ద్వారా లేదా మోహ్రే యాప్ లేదా వెబ్‌సైట్ ద్వారా కార్మిక నిబంధనలను ఉల్లంఘించే సంస్థల వివరాలను నివేదించాలని నివాసితులను కోరింది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com