పూరీ జగన్నాధ్ ప్రూవ్ చేసుకున్నాడా.? లేదా.?
- May 19, 2024
పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘డబుల్ ఇస్మార్ట్’ మూవీ టీజర్ ఇటీవలే రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. మొదట్లో టేక్ లైట్ అనుకున్నా, ఈ టీజర్కి మంచి వ్యూస్ రావడంతో ఒకింత అంచనాలు పెరిగాయ్.
ఈ సినిమాతో ఎలాగైనా హిట్టు కొట్టాలి పూరీ జగన్నాధ్. అప్పుడే తానేంటో మళ్లీ ప్రూవ్ చేసుకోగలడు. అందుకే ఈ సినిమాపై గట్టిగానే ఫోకస్ పెట్టాడట పూరీ. కొందరు సో సో గా వుందంతే అని అంటుంటే, ఇంకొందరు ఏది ఏమైనా పూరీ అంటే పూరీనే ఏదో మ్యాజిక్ వుంటుంది ఆయన సినిమాలో.. అని అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
ఈ సినిమాకొచ్చి ప్రతినాయకుడి పాత్ర మెయిన్ అస్సెట్ కానుందని చెప్పొచ్చేమో. బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ప్రతినాయకుడి పాత్రలో కనిపించబోతున్నాడు. ఆయన పాత్రకు టీజర్లో ఇచ్చిన ఎలివేషన్స్ ఓ రేంజ్లో వున్నాయ్.
విలన్ పాత్ర ఎంత స్ట్రాంగ్గా వుంటే, హీరో పాత్ర అంతగా ఎలివేట్ అవుతుంది. సంజయ్ దత్ లాంటి విలన్ని డబుల్ ధిమాక్ వున్న శంకర్ పాత్ర ఎలా తట్టుకోగలదు.? ఆ సిట్యువేషన్ని డైరెక్టర్గా పూరీ జగన్నాధ్ ఎలా డీల్ చేశాడు.? అనేదే ‘డబుల్ ఇస్మార్ట్’ కథ. చూడాలి మరి.
తాజా వార్తలు
- ఫాల్స్ రియల్ ఎస్టేట్ సమాచారం ఇస్తే SR50,000 వరకు ఫైన్..!!
- ‘అఫాక్’ పేమెంట్ సిస్టమ్ లో చేరిన ఖతార్ సెంట్రల్ బ్యాంక్..!!
- కువైట్ లో కేపిటల్ లో భద్రత మరింత పటిష్టం.. 257 అరెస్ట్..!!
- మెడికల్ సెంటర్ కు షాక్.. డాక్టర్కు BD4,072 చెల్లించాలని కోర్టు తీర్పు..!!
- ఒమన్ కుటుంబాల నెలవారీ ఆదాయం పెరుగుదల..!!
- దుబాయ్ లో 9 రోజుల స్కూల్ బ్రేక్.. అక్టోబర్ హాఫ్-టర్మ్ తేదీల్లో మార్పులు..!!
- వైరల్ గా మారిన H1N1 ఫ్లూ ! లైట్ తీసుకుంటే మీకే ప్రమాదం
- బహ్రెయిన్-భారత్ సంబంధాల బలోపేతంపై ప్రశంసలు..!!
- త్వరలో యూనిఫైడ్ గల్ఫ్ టూరిస్ట్ వీసా..!!
- దుబాయ్లో టండూర్ టీనా రెస్టారెంట్ శాశ్వతంగా మూసివేత..!!







