పూరీ జగన్నాధ్ ప్రూవ్ చేసుకున్నాడా.? లేదా.?
- May 19, 2024
పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘డబుల్ ఇస్మార్ట్’ మూవీ టీజర్ ఇటీవలే రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. మొదట్లో టేక్ లైట్ అనుకున్నా, ఈ టీజర్కి మంచి వ్యూస్ రావడంతో ఒకింత అంచనాలు పెరిగాయ్.
ఈ సినిమాతో ఎలాగైనా హిట్టు కొట్టాలి పూరీ జగన్నాధ్. అప్పుడే తానేంటో మళ్లీ ప్రూవ్ చేసుకోగలడు. అందుకే ఈ సినిమాపై గట్టిగానే ఫోకస్ పెట్టాడట పూరీ. కొందరు సో సో గా వుందంతే అని అంటుంటే, ఇంకొందరు ఏది ఏమైనా పూరీ అంటే పూరీనే ఏదో మ్యాజిక్ వుంటుంది ఆయన సినిమాలో.. అని అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
ఈ సినిమాకొచ్చి ప్రతినాయకుడి పాత్ర మెయిన్ అస్సెట్ కానుందని చెప్పొచ్చేమో. బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ప్రతినాయకుడి పాత్రలో కనిపించబోతున్నాడు. ఆయన పాత్రకు టీజర్లో ఇచ్చిన ఎలివేషన్స్ ఓ రేంజ్లో వున్నాయ్.
విలన్ పాత్ర ఎంత స్ట్రాంగ్గా వుంటే, హీరో పాత్ర అంతగా ఎలివేట్ అవుతుంది. సంజయ్ దత్ లాంటి విలన్ని డబుల్ ధిమాక్ వున్న శంకర్ పాత్ర ఎలా తట్టుకోగలదు.? ఆ సిట్యువేషన్ని డైరెక్టర్గా పూరీ జగన్నాధ్ ఎలా డీల్ చేశాడు.? అనేదే ‘డబుల్ ఇస్మార్ట్’ కథ. చూడాలి మరి.
తాజా వార్తలు
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!







