దుబాయ్ మెట్రో రెడ్ లైన్ సేవలకు అంతరాయం..!
- May 22, 2024
యూఏఈ: అల్ ఖైల్ స్టేషన్ మరియు యూఏఈ ఎక్స్ఛేంజ్ స్టేషన్ మధ్య దుబాయ్ మెట్రో రెడ్ లైన్ సర్వీసులు బుధవారం ఉదయం రెండు గంటలపాటు అంతరాయం ఏర్పడటంతో తిరిగి ప్రారంభించినట్లు రోడ్లు మరియు రవాణా అథారిటీ (RTA) ప్రకటించింది. రద్దీ ఎక్కువగా ఉండే సమయంలో ఆలస్యం జరగడానికి గల కారణం ఏమిటో RTA పేర్కొనలేదు. కానీ "సేవ సాధారణ స్థితికి చేరుకుంది" అని తెలిపింది. అంతరాయం మొదట ఉదయం 6:19 గంటలకు ప్రారంభం అయింది.ఇది ఉదయం కార్యాలయాలకు వెళ్లే ప్రయాణికులను తీవ్రంగా ప్రభావితం చేసింది. కాగా ప్రభావిత స్టేషన్ల మధ్య రవాణాను సులభతరం చేయడానికి ప్రత్యామ్నాయ బస్సు సేవలను మోహరించారు.
తాజా వార్తలు
- వరద ప్రభావిత ప్రాంతాల్లో కొనసాగుతున్న సహాయక చర్యలు.. నేపాల్కు భారత్ రెస్క్యూ బృందాల సహకారం
- అబుదాబిలో ADIHEX ప్రదర్శనను సందర్శించిన షేక్ మహమ్మద్
- యూఏఈలో అనధికార ఆన్లైన్ ఫత్వా ఖాతాల పై చర్యలు..
- సెంచరీతో చెలరేగిన డీజీపీ సీవీ ఆనంద్..
- యూఏఈలో పర్సనల్ లోన్ చెల్లింపులు నిలిచిపోతే ఏమవుతుంది?
- దుబాయ్ ఎయిర్పోర్టులో కొత్త స్కానర్లు..
- భారతీయులకు ఉజ్బెకిస్తాన్ బంపరాఫర్..
- మసందమ్లో కొత్త రహదారి..ఖసబ్-దిబ్బా ప్రయాణ సమయం 55 నిమిషాలకు తగ్గింపు
- హైదరాబాద్ లో అతిపెద్ద క్రికెట్ స్టేడియం..
- ప్రధాని మోదీకి ఉజ్బెకిస్థాన్ అత్యున్నత పురస్కారం







