ఈద్ అల్-అదా..కువైట్ లో గొర్రెలు కొరతకు చెక్..!
- May 22, 2024
కువైట్: ఈద్ అల్-అదాకు ముందు జోర్డాన్ నుండి 10,000 నైమి గొర్రెలు కువైట్ మార్కెట్ కు తరలిరానున్నాయి. 800 గొర్రెలతో మొదటి బ్యాచ్ త్వరలో దేశానికి వస్తుందని అధికారులు తెలిపారు. 1990 తర్వాత తొలిసారిగా గొర్రెలు అబ్దల్లీ సరిహద్దు గుండా దేశంలోకి ప్రవేశిస్తాయని అల్-వావాన్ లైవ్స్టాక్ అండ్ యానిమల్ ఫీడ్ ట్రేడింగ్ కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ) మెనావర్ అల్-వావన్ తెలిపారు. కువైట్ మార్కెట్ లో గొర్రెల కొరత అధికంగా ఉంటుంది. ముఖ్యంగా ఈద్ అల్-అధా సందర్భంగా ఇది మరింత పెరుగుతుంది. ఈ కాలంలో తగినంత సరఫరాకు టర్కీ మరియు సిరియా నుండి మరిన్ని గొర్రెలను దిగుమతి చేసుకోవాలని కూడా యోచిస్తున్నట్లు, దీనివల్ల ధరలు కనీసం 15 శాతం తగ్గుతాయని ఆయన చెప్పారు.
తాజా వార్తలు
- వరద ప్రభావిత ప్రాంతాల్లో కొనసాగుతున్న సహాయక చర్యలు.. నేపాల్కు భారత్ రెస్క్యూ బృందాల సహకారం
- అబుదాబిలో ADIHEX ప్రదర్శనను సందర్శించిన షేక్ మహమ్మద్
- యూఏఈలో అనధికార ఆన్లైన్ ఫత్వా ఖాతాల పై చర్యలు..
- సెంచరీతో చెలరేగిన డీజీపీ సీవీ ఆనంద్..
- యూఏఈలో పర్సనల్ లోన్ చెల్లింపులు నిలిచిపోతే ఏమవుతుంది?
- దుబాయ్ ఎయిర్పోర్టులో కొత్త స్కానర్లు..
- భారతీయులకు ఉజ్బెకిస్తాన్ బంపరాఫర్..
- మసందమ్లో కొత్త రహదారి..ఖసబ్-దిబ్బా ప్రయాణ సమయం 55 నిమిషాలకు తగ్గింపు
- హైదరాబాద్ లో అతిపెద్ద క్రికెట్ స్టేడియం..
- ప్రధాని మోదీకి ఉజ్బెకిస్థాన్ అత్యున్నత పురస్కారం







