భారీ తుఫాన్ హెచ్చరిక .. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దు

- May 23, 2024 , by Maagulf
భారీ తుఫాన్ హెచ్చరిక .. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దు

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రేపు వాయుగుండంగా బలపడనుందని IMD వెల్లడించింది. ఇది 2 రోజుల్లో తుఫానుగా మారనుందని , దీని ప్రభావంతో నేటి నుంచి 3 రోజులు పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించింది. నైరుతి పశ్చిమ మధ్య బంగాళాఖాతాన్ని ఆనుకొని అల్పపీడనం ఏర్పడినట్టు భారత వాతావరణ విభాగం వెల్లడించింది. రానున్న 24 గంటల్లో వాయుగుండంగా మారనున్నది. సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల వరకు ఆవర్తనం విస్తరించింది.

దీంతో అల్పపీడనం ఈశాన్య దిశగా పయనించి శుక్రవారంనాటికి వాయుగుండంగా బలపడి మధ్య బంగాళాఖాతంలోకి ప్రవేశించనుంది. ఆ తర్వాత ఈశాన్య, వాయువ్య బంగాళాఖాతంలోకి ప్రవేశిస్తుందని వాతావరణ శాఖ(IMD) తెలిపింది. ఈ క్రమంలో తుఫాన్‌గా మారి ఈనెల 25వ తేదీ రాత్రి పశ్చిమ బెంగాల్‌, బంగ్లాదేశ్‌ మధ్య తీరం దాటుతుందని కొన్ని మోడళ్లు, బంగ్లాదేశ్‌, మయన్మార్‌ దిశగా వెళుతుందని మరికొన్ని మోడళ్ల ఆధారంగా అంచనా వేశారు. ఈనెల 24వ తేదీ తరువాత ఏర్పడనున్న తుఫాన్‌కు ఒమన్‌ దేశం సూచించిన ‘రీమల్‌’ (REMAL) అని పేరు పెట్టనున్నారు.ఈ తూఫాన్ కారణంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజుల పాటు వర్షాలు పడనున్నాయని పేర్కొంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com