విరిగిప‌డ్డ కొండ‌చ‌రియ‌లు…100 మంది మృతి

- May 24, 2024 , by Maagulf
విరిగిప‌డ్డ కొండ‌చ‌రియ‌లు…100 మంది మృతి

న్యూ గునియా: కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డి వందమంది మృతి చెందారు. ఈఘ‌ట‌న పాపువా న్యూ గునియాలో శుక్ర‌వారం వేకువ‌జామున చోటుచేసుకుంది. తెల్లవారుజామున 3 గంటలకు కొండచరియలు విరిగిపడటంతో అందరూ నిద్రలో ఉన్నారు. నిద్రలోనే వారంతా అనంతలోకాలకు వెళ్లిపోయారు.

మరోవైపు కౌకలం గ్రామం మొత్తం ధ్వంసం అయ్యింది. గ్రామం సమీపంలోనే పర్వతం ఉంది. ఈ పర్వతం పైనుంచే కొండచరియలు విరిగిపడ్డాయి. గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గాయపడ్డవారిని ఆస్పత్రులకు తరలిస్తున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. బండరాళ్లు, శిథిలాలు, చెట్ల కింద ఉన్నవారి మృతదేహాలను బయటకు తీస్తున్నారు. ఈ ఆపరేషన్‌లో అధికారులతో పాటు స్థానికులు కూడా తీవ్రంగా శ్రమిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com