రియాద్ ఫుడ్ పాయిజనింగ్ కేసు.. అధికారులపై చర్యలు..!
- May 24, 2024
రియాద్: రియాద్లో ఇటీవల జరిగిన ఫుడ్ పాయిజనింగ్ సంఘటనకు సంబంధించి సాక్షాలను ఫుడ్ ఇన్స్పెక్టర్లు తారుమారు చేసినట్లు యాంటీ కరప్షన్ అథారిటీ (నజాహా) గుర్తించింది. బాధిత అధికారులపై చర్యలు తీసుకునేందుకు సమాయత్తమవుతుంది. ఏ అధికారులైనా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే వారిపై తీవ్రమైన చర్యలు అమలు చేపడతామని ఇప్పటికే పలుమార్లు హెచ్చరించింది. కింగ్ మరియు క్రౌన్ ప్రిన్స్ పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తున్నారని, ప్రజారోగ్యం మరియు భద్రతను కాపాడేందుకు వేగవంతమైన మరియు పారదర్శక చర్యలు తీసుకుంటున్నట్లు నజాహా వెల్లడించింది. హంబుర్గిని రెస్టారెంట్లో ఉపయోగించిన BON TUM బ్రాండ్ నుండి "క్లోస్ట్రిడియం బోటులినమ్" కలిగి ఉన్న కలుషితమైన మయోనైస్గా గుర్తించారు. వెంటనే స్పందించిన మునిసిపల్ మరియు గ్రామీణ వ్యవహారాలు మరియు గృహనిర్మాణ మంత్రిత్వ శాఖ, సౌదీ ఫుడ్ అండ్ డ్రగ్ అథారిటీతో సమన్వయంతో మయోనైస్ పంపిణీని నిలిపివేసి, రీకాల్ చేయడం ప్రారంభించారు. తాజాగా కొత్త కేసులు ఏవీ నమోదు కానందున ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదించింది.
తాజా వార్తలు
- అటల్ స్మతిన్యాస్ సొసైటీ కార్యచరణ గురించి పలువురితో చర్చించిన వెంకయ్య నాయుడు
- భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
- విలువలతో కూడిన రాజకీయాల్లోకి యువత రావాలి: వెంకయ్య నాయుడు
- అమరావతిలో బిట్స్ పిలాని నిర్మాణ ప్లాన్ లను పరిశీలించిన మంత్రి లోకేష్
- అమెరికా విమానం కూలిన ఘటనలో నలుగురు మృతి
- కువైట్లో ఉరుములతో కూడిన వర్షాలు..!!
- చార్టర్డ్ విమానాలను నిర్వహిస్తున్న ఇండియన్ అసొసియేషన్స్..!!
- ఆహార వస్తువుల సరఫరా, ధరలపై ఆందోళన వద్దు..!!
- యాస్ ఐలాండ్ లో అటానమస్ టాక్సీల విస్తరణ..!!
- మక్కా, మదీనాలోని భవన యజమానులకు హెచ్చరిక జారీ..!!









