రియాద్ ఫుడ్ పాయిజనింగ్ కేసు.. అధికారులపై చర్యలు..!
- May 24, 2024
రియాద్: రియాద్లో ఇటీవల జరిగిన ఫుడ్ పాయిజనింగ్ సంఘటనకు సంబంధించి సాక్షాలను ఫుడ్ ఇన్స్పెక్టర్లు తారుమారు చేసినట్లు యాంటీ కరప్షన్ అథారిటీ (నజాహా) గుర్తించింది. బాధిత అధికారులపై చర్యలు తీసుకునేందుకు సమాయత్తమవుతుంది. ఏ అధికారులైనా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే వారిపై తీవ్రమైన చర్యలు అమలు చేపడతామని ఇప్పటికే పలుమార్లు హెచ్చరించింది. కింగ్ మరియు క్రౌన్ ప్రిన్స్ పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తున్నారని, ప్రజారోగ్యం మరియు భద్రతను కాపాడేందుకు వేగవంతమైన మరియు పారదర్శక చర్యలు తీసుకుంటున్నట్లు నజాహా వెల్లడించింది. హంబుర్గిని రెస్టారెంట్లో ఉపయోగించిన BON TUM బ్రాండ్ నుండి "క్లోస్ట్రిడియం బోటులినమ్" కలిగి ఉన్న కలుషితమైన మయోనైస్గా గుర్తించారు. వెంటనే స్పందించిన మునిసిపల్ మరియు గ్రామీణ వ్యవహారాలు మరియు గృహనిర్మాణ మంత్రిత్వ శాఖ, సౌదీ ఫుడ్ అండ్ డ్రగ్ అథారిటీతో సమన్వయంతో మయోనైస్ పంపిణీని నిలిపివేసి, రీకాల్ చేయడం ప్రారంభించారు. తాజాగా కొత్త కేసులు ఏవీ నమోదు కానందున ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదించింది.
తాజా వార్తలు
- అల్-మసీలా బ్రిడ్జి అభివృద్ధికి సమగ్ర ప్రణాళిక..!!
- కెనడా eTA కి ఖతారీ జాతీయులు అర్హులు..!!
- సౌదీ అరేబియాలో జనవరి 1నుండి న్యూ ట్యాక్స్ పాలసీ..!!
- మరణించిన వారి ఫోటోలను ఆన్లైన్లో పోస్ట్ చేస్తున్నారా?
- 'ఒమన్ ఒడిస్సీ' పుస్తకం విడుదల..!!
- BD 130,000 పెట్టుబడికే బహ్రెయిన్ గోల్డెన్ రెసిడెన్సీ..!!
- ప్రపంచ నెంబర్ వన్ బ్యాట్స్మన్గా హిట్మ్యాన్
- పైరసీ సైట్ల నుంచి సినిమాలు కొనుగోలు చేసి హెచ్డి అప్లోడ్
- ఏవియేషన్ హబ్గా భారత్
- తెలుగు సహా.. తొమ్మిది భాషల్లో రాజ్యాంగం అందుబాటు







