$3 మిలియన్ బహుమతి': సెల్ఫ్ డ్రైవింగ్ ఛాలెంజ్ రిజిస్ట్రేషన్ ప్రారంభం
- May 28, 2024
యూఏఈ: రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ 4వ దుబాయ్ వరల్డ్ ఛాలెంజ్ ఫర్ సెల్ఫ్ డ్రైవింగ్ ట్రాన్స్పోర్ట్ 2025 కోసం రిజిస్ట్రేషన్ను ప్రారంభించినట్లు ప్రకటించింది. విజేతకు $3 మిలియన్ల బహుమతిని అందజేస్తుంది. ఛాలెంజ్లో ఒక ప్రాంతంలో మాల్టీ సమీకృత రవాణా వ్యవస్థలు ఉన్నాయి. ఇందులో పాల్గొనేవారు వారి పరిష్కారంలో కనీసం 2 రవాణా విధానాలలో (అటానమస్ టాక్సీ, అటానమస్ షటిల్, అటానమస్ బస్సులు, అటానమస్ డ్రోన్లు, అటానమస్ మెరైన్, అటానమస్ లాజిస్టిక్స్, అటానమస్ ఏవియేషన్) యూనిఫైడ్ కలిగి ఉండేలా చూసుకోవాలి. 2030 నాటికి దుబాయ్లోని మొత్తం మొబిలిటీ ట్రిప్లలో 25% సెల్ఫ్ డ్రైవింగ్ ట్రిప్లుగా మార్చే ప్రభుత్వ డ్రైవ్కు అనుగుణంగా RTA వ్యూహంలో ఈ సవాలు ఒక భాగం. ఈ లక్ష్యాన్ని యూఏఈ ఉపాధ్యక్షుడు మరియు ప్రధాన మంత్రి షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ప్రకటించారు. పాల్గొనేవారు ఈ గ్లోబల్ పోటీ కోసం వెబ్సైట్ https://sdchallenge.awardsplatform.com ద్వారా నమోదు చేసుకోవచ్చు. ఫైనలిస్ట్ల పేర్లు అక్టోబర్ 2024లో ప్రకటిస్తారు. విజేత కంపెనీ సెప్టెంబర్ 2025లో సెల్ఫ్ డ్రైవింగ్ ట్రాన్స్పోర్ట్ కోసం జరిగే దుబాయ్ వరల్డ్ కాంగ్రెస్ సందర్భంగా ఆవిష్కరిస్టారు. విజేత కంపెనీ $3 మిలియన్ల బహుమతిని అందుకుంటుంది.
తాజా వార్తలు
- ఒమన్తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!