ఏపీలో కౌంటింగ్కు సర్వం సిద్ధం
- May 29, 2024
అమరావతి: ఏపీలో జూన్ 4న ఓట్ల లెక్కింపునకు ప్రధాన ఏర్పాట్లన్నీ పూర్తి చేసినట్లు సీఈవో ముకేశ్ కుమార్ మీనా తెలిపారు. ఆరోజు రాత్రి 8 నుంచి 9 గంటల మధ్య అన్ని నియోజకవర్గాల తుది ఫలితాలను ప్రకటిస్తామన్నారు. ఈ మేరకు ఓట్ల లెక్కింపు ఏర్పాట్లపై సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ నితీష్ వ్యాస్ కు వివరించారు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేశ్ కుమార్ మీనా.
సీఈవో ముకేశ్ కుమార్ మీనా..
”ఈ నెల 4న ఓట్ల లెక్కింపునకు పక్కాగా ఏర్పాట్లు. రాత్రి 8 నుంచి 9 గంటల మధ్య అన్ని నియోజకవర్గాల తుది ఫలితాలు వెలువడే విధంగా చర్యలు. 111 నియోజకవర్గాల్లో 20 రౌండ్లలోపు మధ్యాహ్నం 2 గంటల్లోగా ఫలితాల వెల్లడి. 61 నియోజకవర్గాల్లో 21 నుంచి 24 రౌండ్లలో సాయంత్రం నాలుగు గంటల్లోగా ఫలితాలు వెల్లడి. మూడు నియోజకవర్గాల్లో 25 రౌండ్లకు పైగా లెక్కింపుతో సాయంత్రం 6 గంటల్లోగా రిజల్ట్స్ వెల్లడి. పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపునకు ఆలస్యం కాకుండా టేబుల్స్ పెంపు”.
తాజా వార్తలు
- తెలంగాణలో నేడు ఈ జిల్లాల్లో వానల హెచ్చరిక..
- మరోసారి తన గొప్ప మనసు చాటుకున్న సోనూ సూద్..
- TTDకి అనంత్ అంబానీ 25 ఎలక్ట్రిక్ బస్సుల విరాళం
- యూఏఈ లాటరీ 'లక్కీ డే' డ్రా..ఒక్కరికే Dh100,000 సొంతం..!!
- సోషల్ మీడియాలో వైరల్ వీడియోపై ఖతార్ ఎయిర్వేస్ క్లారిటీ..!!
- లూలూలో భారీ టెక్ డీల్స్..‘లెట్స్ కనెక్ట్’ టెక్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- ICRF సమ్మర్ అవేర్నెస్..200 మంది కార్మికులకు ప్రయోజనం..!!
- విషాదం..సైనికుడి మృతికి యూఏఈ సంతాపం..!!
- ఒమన్ లో ప్లాస్టిక్ పై నిషేధం..జూలై 1 నుండి ఐదవ దశ ప్రారంభం..!!
- సముద్రయానం ముప్పు..సౌదీ, ఈజిప్ట్, ఖతార్ చర్చలు..!!







