గన్నవరం ఎయిర్ పోర్టులో సీఎం జగన్కు ఘన స్వాగతం..
- June 01, 2024
గన్నవరం: లండన్ టూర్ ముగించుకొని ఏపీకి తిరిగివచ్చిన సీఎం జగన్ కు పార్టీ నేతలు , అభిమానులు ఘన స్వాగతం పలికారు. గన్నవరం ఎయిర్ పోర్టులో సీఎం జగన్కు ఎంపీలు విజయసాయిరెడ్డి, నందిగం సురేష్ , మంత్రులు జోగి రమేష్, చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ, కారుమూరి నాగేశ్వరరావు, మేరుగ నాగార్జున, కొట్టు సత్యనారాయణ స్వాగతం పలికారు.
ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికలు పూర్తైన తర్వాత మే 17 జగన్ ఫారెన్ టూర్ కు వెళ్లారు. అక్కడ లండన్, స్విట్జర్లాండ్లో ఫ్యామిలీతో తిరిగారు. పర్యటన ముంగించుకొని ప్రత్యేక విమానంలో రాష్ట్రానికి చేరుకున్నారు. ఎయిర్ పోర్ట్ నుండి నేరుగా తాడేపల్లి నివాసానికి చేరుకున్నారు. ఈరోజు నుండి జగన్ రాజకీయాలతో బిజీ కాబోతున్నారు. కౌంటింగ్ సందర్భంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేదానిపై నేతలతో చర్చలు జరపనున్నారు. 15 రోజులుగా రాష్ట్రంలో జరిగిన పరిణామాలపై కూడా సమీక్ష చేయనున్నారు.
తాజా వార్తలు
- హైదరాబాద్ కు రూ.లక్ష కోట్లు కేటాయించండి..ప్రధాని మోదీని కోరిన సీఎం రేవంత్
- అమెరికా దాడిలో వైజాగ్ వాసి మృతి
- రషీద్ ఆసుపత్రిలో క్షతగాత్రుడు సయ్యద్ను పరామర్శించిన ఎమ్మెల్యే సత్యం
- దుబాయ్లో టాక్సీ డ్రైవర్ ఉద్యోగాలు..ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- తెలుగు రాష్ట్రాల్లో ప్రైవేట్ స్కూల్స్ అధిక ఫీజులు వసూలు చేస్తే ఈ నెంబర్ కు కాల్ చేయండి!
- ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో భారతీరాజా అంత్యక్రియలు పూర్తి
- ఎస్ఆర్ స్కూల్స్ లో శిఖార్ వినూత్న విద్యా కార్యక్రమం ఘనంగా ప్రారంభం
- రూ.5000 కోట్ల భారీ మోసానికి హైదరాబాద్ పోలీసుల అడ్డుకట్ట
- కువైట్ గగనతలంలో 24 శత్రు డ్రోన్లను అడ్డుకున్న సాయుధ దళాలు
- ‘వికసిత్ భారత్’ దిశగా AM/NS ఇండియా–బిట్స్ పిలానీ భాగస్వామ్యం









