గన్నవరం ఎయిర్ పోర్టులో సీఎం జగన్‌కు ఘన స్వాగతం..

- June 01, 2024 , by Maagulf
గన్నవరం ఎయిర్ పోర్టులో సీఎం జగన్‌కు ఘన స్వాగతం..

గన్నవరం: లండన్ టూర్ ముగించుకొని ఏపీకి తిరిగివచ్చిన సీఎం జగన్ కు పార్టీ నేతలు , అభిమానులు ఘన స్వాగతం పలికారు. గన్నవరం ఎయిర్ పోర్టులో సీఎం జగన్‌కు ఎంపీలు విజయసాయిరెడ్డి, నందిగం సురేష్ , మంత్రులు జోగి రమేష్, చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ, కారుమూరి నాగేశ్వరరావు, మేరుగ నాగార్జున, కొట్టు సత్యనారాయణ స్వాగతం పలికారు.

ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికలు పూర్తైన తర్వాత మే 17 జగన్ ఫారెన్ టూర్ కు వెళ్లారు. అక్కడ లండన్, స్విట్జర్లాండ్లో ఫ్యామిలీతో తిరిగారు. పర్యటన ముంగించుకొని ప్రత్యేక విమానంలో రాష్ట్రానికి చేరుకున్నారు. ఎయిర్ పోర్ట్ నుండి నేరుగా తాడేపల్లి నివాసానికి చేరుకున్నారు. ఈరోజు నుండి జగన్ రాజకీయాలతో బిజీ కాబోతున్నారు. కౌంటింగ్ సందర్భంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేదానిపై నేతలతో చర్చలు జరపనున్నారు. 15 రోజులుగా రాష్ట్రంలో జరిగిన పరిణామాలపై కూడా సమీక్ష చేయనున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com