సోనియా గాంధీ తెలంగాణ పర్యటన రద్దు
- June 01, 2024
న్యూ ఢిల్లీ: సోనియా గాంధీ తెలంగాణ పర్యటన రద్దు అయింది. రేపు జరగబోయే తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు సోనియా గాంధీ హాజరు కావడం లేదని.. ఈ మేరకు ఏఐసీసీ కార్యాలయం అధికారికంగా ప్రకటించింది. రేపు జరిగే ఆవిర్భావ వేడుకలకు సోనియాగాంధీని సీఎం రేవంత్ ఆహ్వానించిన విషయం తెలిసిందే.
గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న సోనియా ఈ టూర్ విషయంలో తన వ్యక్తిగత వైద్యుడి సలహా కోరారు. సోనియా ఆరోగ్యం దృష్ట్యా ఈ ప్రయాణం మానుకుంటేనే మేలని వైద్యుడు చెప్పడంతో తెలంగాణ టూర్ ను ఆమె రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది. అనారోగ్య కారణాలతో రాష్ట్ర అవతరణ వేడుకలకు సోనియా హాజరు కావడంలేదని ఏఐసీసీ ఓ ప్రకటనలో తెలిపింది.
కాగా, జూన్ 02, 2024న రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో ఘనంగా నిర్వహించాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీని ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర అవతరణ దినోత్సవ ఏర్పాట్లను భారీగా చేస్తున్నారు.
తాజా వార్తలు
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!
- GCC జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశం..!!
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!