ఒలింపిక్ రేసులోకి బాక్సర్ అమిత్ పంగల్ …
- June 02, 2024
ప్యారిస్: భారత యువ బాక్సర్ అమిత్ పంగల్ విశ్వ వేదికపై తన పంచ్ వవర్ చూపించాడు. కీలక పోరులో చైనా బాక్సర్ను చిత్తుగా ఓడించి 51 కిలోల విభాగంలో ప్యారిస్ ఒలింపిక్స్ బెర్తు ఖాయం చేసుకున్నాడు. తద్వారా భారత్ నుంచి విశ్వక్రీడలకు అర్హత సాధించిన ఐదో బాక్సర్గా పంగల్ రికార్డు నెలకొల్పాడు.
ఆదివారం జరిగిన క్వాలిఫయర్స్ క్వార్టర్స్లో అమిత్ రెచ్చిపోయాడు. చైనాకు చెందిన లూ చౌంగ్పై పంచ్ల వర్షం కురిపించి 5-0తో గెలుపొంది సెమీస్కు దూసుకెళ్లాడు. దాంతో, నిశాత్ దేవ్ తర్వాత ఒలింపిక్స్ బెర్తు ఖాయం చేసుకున్న రెండో పురుష బాక్సర్గా అమిత్ నిలిచాడు.
ప్రస్తుతానికి పంగల్తో కలిపి ఐదుగురు బాక్సర్లు ఒలింపిక్స్ పోటీలకు అర్హత సాధించారు. నిఖత్ జరీన్ (50 కిలోలు), లవ్లినా బొర్గొహన్ (75 కిలోలు), ప్రీతి పవార్(54 కిలోలు), నిశాంత్ దేవ్ (71 కిలోలు), అమిత్ పంగల్(51 కేజీ) లు విశ్వ క్రీడల్లో పతకంపై గురి పెట్టారు.
తాజా వార్తలు
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!
- యూఏఈలో పిల్లల స్కూల్ లంచ్..నెలకు Dh800 వరకు ఖర్చు..!!
- విద్యా సంస్థల లైసెన్సులు, ఫీజులపై తనిఖీలు చేయాలి..!!
- సౌదీ - ఫ్రాన్స్ సంబంధాల్లో కీలక ముందడుగు..!!
- పిల్లల బ్యాక్ప్యాక్ల ఎంపిక..ఖతార్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక సూచనలు..!!
- 14 దేశాలకు పార్టీ అధ్యక్షులను నియమించిన TRS పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత
- ఒమన్ పౌరులకు గుడ్ న్యూస్ చెప్పిన బోట్స్వానా..!!
- ఆహార భద్రతపై భారత్–కువైట్ చర్చలు..!!
- పేషంట్ మృతికి కారణమైన డాక్టర్లకు ఆరు నెలల జైలుశిక్ష..!!







