ఆంధ్రప్రదేశ్లో కుమ్మేస్తున్న కూటమి..
- June 04, 2024
ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీఏ కూటమి ఎదురులేకుండా దూసుకుపోతోంది. వైసీపీకు పలు నియోజకవర్గాల్లో ఓటర్లు గట్టి షాక్ ఇస్తున్నారు. ఇప్పటికే మెజార్టీ స్థానాలను దాటి ఎన్డీఏ కూటమి దూకుడు ప్రదర్శిస్తోంది. చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేశ్ భారీ మెజార్టీ దిశగా సాగుతున్నారు. లోక్సభ స్థానాల్లోనూ కూటమి అభ్యర్థుల హవా కొనసాగుతోంది. వెలువడుతున్న ఫలితాలతో కూటమి శ్రేణుల్లో జోష్ కనిపిస్తోంది. ఇప్పటికే 103కుపైగా స్థానాల్లో టీడీపీ...14 కుపైగా స్థానాల్లో జనసేన.. మూడు స్థానాల్లో బీజేపీ ముందంజలో ఉండగా... వైసీపీ కేవలం 2 స్థానాల్లోనే ముందంజలో ఉంది. ఫలితాలు ఇలాగే కొనసాగితే వైసీపీకీ 25 స్థానాలు దక్కడం కూడా కష్టమే అని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
తాజా వార్తలు
- ఇల్లు కొంటే మహిళల పేరుపైనే రిజిస్ట్రేషన్!
- IPL 2026: చెన్నై సూపర్ కింగ్స్ పై పంజాబ్ కింగ్స్ ఘన విజయం
- వణికిన ఉత్తర భారత్..ఢిల్లీలో భూకంపం!
- హైదరాబాద్ మెట్రో స్వాధీనం: ఏప్రిల్ 30 వరకు గడువు పొడిగింపు
- తెలుగు అసోసియేషన్ క్రికెట్ లీగ్ సీజన్–3 ఘనవిజయం
- బంగ్లాదేశ్లో ఇంధన ఎమర్జెన్సీ: సాయంత్రం 6 గంటలకే మాల్స్ బంద్!
- ప్రభుత్వ సేవలు ఇక మీ వాట్సాప్లోనే.. ‘Hi’ చెబితే చాలు!
- దుబాయ్ హిందూ దేవాలయం, గురుద్వారా మూసివేత..!!
- ఒమన్- బెలారస్ సంబంధాల పై సమీక్ష..!!
- బహ్రెయిన్ లో టూర్ గైడింగ్ బలోపేతానికి కృషి..!!









