OPEC+ ఉత్పత్తి కోతలు పొడిగింపు
- June 04, 2024
రియాద్: పెట్రోలియం ఎగుమతి దేశాల సంస్థ (OPEC) మరియు దాని మిత్రదేశాలు, సమిష్టిగా OPEC+ అని పిలుస్తారు.2025 చివరి వరకు రోజుకు 2.2 మిలియన్ బ్యారెళ్ల స్వచ్ఛంద ఉత్పత్తి కోతలను పొడిగించడానికి అంగీకరించాయి. ఈ మేరకు OPEC ఒక పత్రికా ప్రకటనలో ప్రకటించింది. ఉత్పత్తిని పర్యవేక్షించడానికి జాయింట్ మినిస్టీరియల్ మానిటరింగ్ కమిటీ (JMMC) ప్రతి రెండు నెలలకోసారి సమావేశమవుతుంది. రష్యా నేతృత్వంలోని OPEC మరియు మిత్రదేశాలను కలిగి ఉన్న కూటమి 2022 చివరి నుండి గణనీయమైన ఉత్పత్తి కోతలను అమలు చేస్తుంది. ప్రస్తుతం, మొత్తం కోతలు రోజుకు 5.86 మిలియన్ బ్యారెల్స్గా ఉన్నాయి. ఇది ప్రపంచ డిమాండ్లో దాదాపు 5.7% నికి సమానం. ఈ కోతల్లో 2024 చివరి వరకు OPEC+ సభ్యుల నుండి రోజుకు 3.66 మిలియన్ బ్యారెల్స్ ఉన్నాయి. 2025లో రోజుకు 3.519 మిలియన్ బ్యారెల్స్కు పెరుగుతుంది. ఈ పెరుగుదల జనవరి నుండి సెప్టెంబరు 2025 చివరి వరకు దశలవారీగా అమలు చేయనున్నారు.
తాజా వార్తలు
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!
- GCC జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశం..!!
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!