మంగళగిరిలో నారా లోకేష్ ఘన విజయం
- June 04, 2024
అమరావతి: ఏపీలో అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. టీడీపీ గెలుపు దిశగా పయనిస్తుండగా.. మంగళగిరిలో టీడీపీ ప్రధాన కార్యదర్శి, మంగళగిరి టీడీపీ అభ్యర్థి నారాలోకేష్ ఘన విజయం సాధించారు.
తన సమీప ప్రత్యర్థి, వైసీపీ అభ్యర్థి మురుగుడు లావణ్యపై లోకేష్ విజయం సాధించారు. టీడీపీ దశాబ్దాలుగా గెలవని మంగళగిరి సీటులో గెలిచారు. ఇప్పటి వరకూ ఈ నియోజకవర్గంలో 15 సార్లు ఎన్నికలు జరిగితే టీడీపీ 2 సార్లు గెలిచింది.అది కూడా 1983, 1985ల్లో టీడీపీ గెలిచింది. అంతే కాకుండా ఇక్కడ కమ్యూనిస్టుల ప్రభావం ఎక్కువ. దీంతో టీడీపీ సైతం పొత్తులో భాగంగా కమ్యూనిస్టులకే మంగళగిరి సీటును కేటాయిస్తూ వచ్చింది.
2019లో మంగళగిరిలో టీడీపీ నుంచి బరిలోకి దిగిన లోకేశ్ వైఎస్సార్సీపీకి చెందిన ఆళ్ల రామకృష్ణారెడ్డి చేతిలో 5 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఆ ఎన్నికల్లో పద్మశాలీలు టీడీపీకి ఓటేయబోమని ప్రకటించడం లోకేశ్కు ప్రతికూలమైంది. మంగళగిరి నుంచి నారా లోకేశ్ పోటీ చేయడమే అందర్నీ ఆశ్చర్యపరిచింది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..