స్కూల్ టాపర్లను సత్కరించిన ఇండియన్ స్కూల్
- June 05, 2024
మనామా: ఇండియన్ స్కూల్ బహ్రెయిన్ మే 30న CBSE పరీక్షల్లో విద్యార్థులు సాధించిన అత్యుత్తమ విజయాలను పురస్కరించుకుని వార్షిక అకడమిక్ అవార్డు వేడుకను నిర్వహించింది. ఇసా టౌన్ క్యాంపస్లోని జషన్మల్ ఆడిటోరియంలో 2023-2024 విద్యాసంవత్సరంలో అద్భుతమైన ప్రదర్శన చేసిన X మరియు XII గ్రేడ్ల నుండి సుమారు 260 మంది అత్యుత్తమ విద్యార్థులకు పతకాలు, సర్టిఫికేట్లను అందజేసారు. ఈ కార్యక్రమానికి భారత రాయబారి వినోద్ కె జాకబ్ ముఖ్య అతిథిగా విచ్చేయగా, వైకె అల్మోయ్యద్ అండ్ సన్స్ డైరెక్టర్ హలా ఫరూక్ అల్మోయ్యద్ గౌరవ అతిథిగా హాజరయ్యారు. ఇండియన్ ఎంబసీ అటాచ్ (ఎడ్యుకేషన్) రాజేంద్ర కుమార్ మీనా, చైర్మన్ బిను మన్నిల్ వరుగీస్, సెక్రటరీ వి రాజపాండియన్ మరియు వైస్ చైర్మన్ డాక్టర్ మహమ్మద్ ఫైజల్ కూడా పాల్గొన్నారు.
తాజా వార్తలు
- గల్ఫ్ దేశాల పై దాడులు ఆపాలంటూ సమితిలో తీర్మానం
- మెట్రోలో ఫోన్పే మ్యాజిక్
- మిడిల్ ఈస్ట్ నుంచి సురక్షితంగా స్వదేశానికి చేరుకున్న భారతీయులు
- తెలంగాణ: ఈనెల 16 నుంచి ఒంటిపూట బడులు
- ఈద్ అల్ ఫితర్..యూఏఈలో వర్షం పడుతుందా?
- 32 ఉల్లంఘనలను జారీ చేసిన కువైట్ వాణిజ్య మంత్రిత్వ శాఖ..!!
- అత్యవసర సంఘటన ప్రాంతాలకు దూరంగా ఉండండి..!!
- ఖతార్ లో 6నెలలకు సరిపోయేలా నిత్యావసరాల నిల్వలు..!!
- SR1 బిలియన్ దాటిన ఎహ్సాన్ ఛారిటీ విరాళాలు..!!
- పిల్లలకు టీకాలు వేయించని పేరెంట్స్ కు Dh20,000 వరకు జరిమానా..!!









