రమదాన్లో డయాబెటిక్ పేషెంట్ల ఉపవాసమెలా?
- June 11, 2016
ఖతార్ డయాబెటిస్ అసోసియేషన్, 15 ఏళ్ళుగా రమదాన్ సందర్భంగా డయాబెటిక్ పేషెంట్లు ఉపవాస దీక్షలు చేయడంపై అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తోంది. పవిత్ర రమదాన్ మాసంలో ఉపవాసాన్ని ఎంతో బాధ్యతగా నిర్వహిస్తారు ముస్లింలు. అయితే డయాబెటిక్ సమస్యలతో వారి ఆరోగ్యానికి ఇబ్బందికర పరిస్థితులు ఉపవాసంతో తలెత్తుతాయి. అలాంటి ఇబ్బందులు రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు ఊచిస్తున్నారు. దీనికి సంబంధించి అవగాహనా కార్యక్రమాలు నిర్వహించేందుకు మూడు వర్క్షాపులను ఏర్పాటు చేసింది. మహిళా, పురుష పేషెంట్లకు అలాగే జనరల్ ప్రాక్టీషనర్లకు ఈ వర్క్షాప్లో అవగాఖన కల్పిస్తారు. పేషెంట్లను వివిధ కేటగిరీల కింద విభజించి, ఎవరైతే ఉపవాసం చెయ్యకూడదో అలాంటివారికి ప్రత్యేకంగా కౌన్సిలింగ్ ఇవ్వవలసి ఉంటుంది. హై రిస్క్, లో రిస్క్ మరియు మిడిల్ రిస్క్ కేటగిరీల కింద వీరిని విభజించాలి. హెచ్ఎంసి మరియు ప్రైమరీ హెల్త్ కేర్, క్యుడిఎ సంయుక్తంగా హాట్లైన్ నెంబర్లను ఏర్పాటు చేసి, పేషెంట్లకు అందుబాటులోకి తెచ్చారు. 30 మంది డాక్టర్లు ఫోన్ ద్వారా పేషెంట్లకు తగిన సమాచారం ఇస్తారు. తగిన వ్యాయామం చేస్తూ, తగినంత విశ్రాంతి తీసుకుని, చెడు అలవాట్లను దరిచేరనీయకుండా ఉంటే రంజాన్ ఉపవాసాల్ని లో రిస్క్ డయాబెటిక్ పేషెంట్లు చెయ్యవచ్చనీ, హైరిస్క్ పేషెంట్లు మాత్రం తగిన జాగ్గ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచించారు.
తాజా వార్తలు
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!







