ఉష్ణోగ్రతలను 20 డిగ్రీల సెల్సియస్ తగ్గించేందుకు రోడ్ కూలింగ్ ఇనిషియేటివ్
- June 06, 2024
రియాద్: రోడ్స్ జనరల్ అథారిటీ (RGA) యాత్రికుల కోసం ఉష్ణోగ్రతలను తగ్గించడానికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నమీరా మసీదు చుట్టూ వైట్ పెయింట్ పనులను పూర్తి చేసింది. అరాఫత్ రోజున మండుతున్న ఎండలో యాత్రికులకు ఇది సాంత్వన కలిగించనుంది. తక్కువ సూర్యరశ్మిని గ్రహించేలా స్థానికంగా తయారు చేయబడిన పదార్థాలను ఉపయోగించి సృష్టించబడిన వైట్ పెయింట్, ఉపరితల ఉష్ణోగ్రతను సుమారు 20 డిగ్రీల సెల్సియస్ తగ్గించడంలో సహాయపడుతుందని రోడ్స్ జనరల్ అథారిటీ ప్రతినిధి అబ్దుల్ అజీజ్ అల్-ఒటైబి తెలిపారు. గత సంవత్సరం, ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండే జమ్రాత్ ప్రాంతానికి దారితీసే పాదచారుల మార్గాలపై ఈ ప్రయోగం విజయవంతమైనట్టు పేర్కొన్నారు. ఇది ఉష్ణోగ్రతలను 12 నుండి 15 డిగ్రీల సెల్సియస్ వరకు తగ్గించిందని తెలిపారు. సాధారణంగా రోడ్లు రాత్రి సమయంలో ఈ వేడిని విడుదల చేస్తాయని, దీని వలన "అర్బన్ హీట్ ఐలాండ్ ఎఫెక్ట్" అని పిలుస్తారని, ఇది వాయు కాలుష్యం పెరగడానికి దారితీస్తుందని వివరించారు.
తాజా వార్తలు
- పబ్లిక్ ప్లేస్లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!
- సౌదీ అరేబియాలో 2026–27 హంటింగ్ సీజన్ ప్రారంభం..నిబంధనలు కఠినం..!!
- డొమెస్టిక్ వర్కర్ల నియామక ప్రకటనలపై ఖతార్ కార్మిక మంత్రిత్వ శాఖ హెచ్చరిక..!!
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు







