ఉష్ణోగ్రతలను 20 డిగ్రీల సెల్సియస్ తగ్గించేందుకు రోడ్ కూలింగ్ ఇనిషియేటివ్
- June 06, 2024
రియాద్: రోడ్స్ జనరల్ అథారిటీ (RGA) యాత్రికుల కోసం ఉష్ణోగ్రతలను తగ్గించడానికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నమీరా మసీదు చుట్టూ వైట్ పెయింట్ పనులను పూర్తి చేసింది. అరాఫత్ రోజున మండుతున్న ఎండలో యాత్రికులకు ఇది సాంత్వన కలిగించనుంది. తక్కువ సూర్యరశ్మిని గ్రహించేలా స్థానికంగా తయారు చేయబడిన పదార్థాలను ఉపయోగించి సృష్టించబడిన వైట్ పెయింట్, ఉపరితల ఉష్ణోగ్రతను సుమారు 20 డిగ్రీల సెల్సియస్ తగ్గించడంలో సహాయపడుతుందని రోడ్స్ జనరల్ అథారిటీ ప్రతినిధి అబ్దుల్ అజీజ్ అల్-ఒటైబి తెలిపారు. గత సంవత్సరం, ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండే జమ్రాత్ ప్రాంతానికి దారితీసే పాదచారుల మార్గాలపై ఈ ప్రయోగం విజయవంతమైనట్టు పేర్కొన్నారు. ఇది ఉష్ణోగ్రతలను 12 నుండి 15 డిగ్రీల సెల్సియస్ వరకు తగ్గించిందని తెలిపారు. సాధారణంగా రోడ్లు రాత్రి సమయంలో ఈ వేడిని విడుదల చేస్తాయని, దీని వలన "అర్బన్ హీట్ ఐలాండ్ ఎఫెక్ట్" అని పిలుస్తారని, ఇది వాయు కాలుష్యం పెరగడానికి దారితీస్తుందని వివరించారు.
తాజా వార్తలు
- మరోసారి తన గొప్ప మనసు చాటుకున్న సోనూ సూద్..
- TTDకి అనంత్ అంబానీ 25 ఎలక్ట్రిక్ బస్సుల విరాళం
- యూఏఈ లాటరీ 'లక్కీ డే' డ్రా..ఒక్కరికే Dh100,000 సొంతం..!!
- సోషల్ మీడియాలో వైరల్ వీడియోపై ఖతార్ ఎయిర్వేస్ క్లారిటీ..!!
- లూలూలో భారీ టెక్ డీల్స్..‘లెట్స్ కనెక్ట్’ టెక్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- ICRF సమ్మర్ అవేర్నెస్..200 మంది కార్మికులకు ప్రయోజనం..!!
- విషాదం..సైనికుడి మృతికి యూఏఈ సంతాపం..!!
- ఒమన్ లో ప్లాస్టిక్ పై నిషేధం..జూలై 1 నుండి ఐదవ దశ ప్రారంభం..!!
- సముద్రయానం ముప్పు..సౌదీ, ఈజిప్ట్, ఖతార్ చర్చలు..!!
- వెనిజులాలో భూకంపాల విధ్వంసం..మృతుల సంఖ్య 1,430కు చేరిక







