ఉష్ణోగ్రతలను 20 డిగ్రీల సెల్సియస్ తగ్గించేందుకు రోడ్ కూలింగ్ ఇనిషియేటివ్
- June 06, 2024
రియాద్: రోడ్స్ జనరల్ అథారిటీ (RGA) యాత్రికుల కోసం ఉష్ణోగ్రతలను తగ్గించడానికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నమీరా మసీదు చుట్టూ వైట్ పెయింట్ పనులను పూర్తి చేసింది. అరాఫత్ రోజున మండుతున్న ఎండలో యాత్రికులకు ఇది సాంత్వన కలిగించనుంది. తక్కువ సూర్యరశ్మిని గ్రహించేలా స్థానికంగా తయారు చేయబడిన పదార్థాలను ఉపయోగించి సృష్టించబడిన వైట్ పెయింట్, ఉపరితల ఉష్ణోగ్రతను సుమారు 20 డిగ్రీల సెల్సియస్ తగ్గించడంలో సహాయపడుతుందని రోడ్స్ జనరల్ అథారిటీ ప్రతినిధి అబ్దుల్ అజీజ్ అల్-ఒటైబి తెలిపారు. గత సంవత్సరం, ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండే జమ్రాత్ ప్రాంతానికి దారితీసే పాదచారుల మార్గాలపై ఈ ప్రయోగం విజయవంతమైనట్టు పేర్కొన్నారు. ఇది ఉష్ణోగ్రతలను 12 నుండి 15 డిగ్రీల సెల్సియస్ వరకు తగ్గించిందని తెలిపారు. సాధారణంగా రోడ్లు రాత్రి సమయంలో ఈ వేడిని విడుదల చేస్తాయని, దీని వలన "అర్బన్ హీట్ ఐలాండ్ ఎఫెక్ట్" అని పిలుస్తారని, ఇది వాయు కాలుష్యం పెరగడానికి దారితీస్తుందని వివరించారు.
తాజా వార్తలు
- ఇల్లు కొంటే మహిళల పేరుపైనే రిజిస్ట్రేషన్!
- IPL 2026: చెన్నై సూపర్ కింగ్స్ పై పంజాబ్ కింగ్స్ ఘన విజయం
- వణికిన ఉత్తర భారత్..ఢిల్లీలో భూకంపం!
- హైదరాబాద్ మెట్రో స్వాధీనం: ఏప్రిల్ 30 వరకు గడువు పొడిగింపు
- తెలుగు అసోసియేషన్ క్రికెట్ లీగ్ సీజన్–3 ఘనవిజయం
- బంగ్లాదేశ్లో ఇంధన ఎమర్జెన్సీ: సాయంత్రం 6 గంటలకే మాల్స్ బంద్!
- ప్రభుత్వ సేవలు ఇక మీ వాట్సాప్లోనే.. ‘Hi’ చెబితే చాలు!
- దుబాయ్ హిందూ దేవాలయం, గురుద్వారా మూసివేత..!!
- ఒమన్- బెలారస్ సంబంధాల పై సమీక్ష..!!
- బహ్రెయిన్ లో టూర్ గైడింగ్ బలోపేతానికి కృషి..!!









