ఉష్ణోగ్రతలను 20 డిగ్రీల సెల్సియస్ తగ్గించేందుకు రోడ్ కూలింగ్ ఇనిషియేటివ్
- June 06, 2024
రియాద్: రోడ్స్ జనరల్ అథారిటీ (RGA) యాత్రికుల కోసం ఉష్ణోగ్రతలను తగ్గించడానికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నమీరా మసీదు చుట్టూ వైట్ పెయింట్ పనులను పూర్తి చేసింది. అరాఫత్ రోజున మండుతున్న ఎండలో యాత్రికులకు ఇది సాంత్వన కలిగించనుంది. తక్కువ సూర్యరశ్మిని గ్రహించేలా స్థానికంగా తయారు చేయబడిన పదార్థాలను ఉపయోగించి సృష్టించబడిన వైట్ పెయింట్, ఉపరితల ఉష్ణోగ్రతను సుమారు 20 డిగ్రీల సెల్సియస్ తగ్గించడంలో సహాయపడుతుందని రోడ్స్ జనరల్ అథారిటీ ప్రతినిధి అబ్దుల్ అజీజ్ అల్-ఒటైబి తెలిపారు. గత సంవత్సరం, ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండే జమ్రాత్ ప్రాంతానికి దారితీసే పాదచారుల మార్గాలపై ఈ ప్రయోగం విజయవంతమైనట్టు పేర్కొన్నారు. ఇది ఉష్ణోగ్రతలను 12 నుండి 15 డిగ్రీల సెల్సియస్ వరకు తగ్గించిందని తెలిపారు. సాధారణంగా రోడ్లు రాత్రి సమయంలో ఈ వేడిని విడుదల చేస్తాయని, దీని వలన "అర్బన్ హీట్ ఐలాండ్ ఎఫెక్ట్" అని పిలుస్తారని, ఇది వాయు కాలుష్యం పెరగడానికి దారితీస్తుందని వివరించారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..