ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అభినందించిన టీపీసీసీ కార్యవర్గం
- June 06, 2024
హైదరాబాద్: పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ సాధించిన ఫలితాల పై హర్షం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని టీపీసీసీ కార్యవర్గం అభినందించింది.గతంలో మూడు పార్లమెంట్ స్థానాలకే పరిమితమైన కాంగ్రెస్..ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారధ్యంలో 8 స్థానాలకు చేరుకోవడం పై సంతోషం వ్యక్తం చేశారు.పీసీసీ అధ్యక్షుడిగా,ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి కృషి ఫలితంగానే కాంగ్రెస్ 8స్థానాలు గెలుచుకుందని వారు కొనియాడారు.ఈ కార్యక్రమంలో ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు రోహిన్ రెడ్డి, ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ రెడ్డి, హర్కర వేణుగోపాల్, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్,ఎంపీ అభ్యర్థి మల్లు రవి, ఫహీం ఖురేషీ,ఈరవత్రి అనిల్ తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- వెనిజులాలో భూకంపాల విధ్వంసం..మృతుల సంఖ్య 1,430కు చేరిక
- కరీంనగర్లో తొలి స్పేస్ ల్యాబ్ ప్రారంభించిన పారమిత హెరిటేజ్ పాఠశాల
- వాహనాల నిర్వహణను నిర్లక్ష్యం చేయొద్దు..దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్మికుల భద్రతకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం
- సౌదీ అరేబియాకు వెళ్లే ప్రయాణికులకు బంగారం పై కొత్త నిబంధనలు
- కువైట్లో అతిపెద్ద వలస కార్మిక వర్గంగా భారతీయులు..!!
- హోర్ముజ్ లో నౌకాయాన స్వేచ్ఛపై సౌదీతో ఒమన్ చర్చలు..!!
- మరో 8మంది భారతీయుల మృతదేహాలు స్వదేశానికి తరలింపు..!!
- యూఏఈ మీడియేషన్ విజయాన్ని స్వాగతించిన బహ్రెయిన్..!!
- వెనిజులాకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల తక్షణ సహాయం..!!







