ఆంధ్రా ప్రీమియర్ లీగ్ కొత్త లోగో
- June 10, 2024
స్థానిక క్రికెటర్లను ప్రోత్సహించే లక్ష్యంతో ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) నిర్వహిస్తున్న ఆంధ్రా ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్) మూడో సీజన్ రంగం సిద్ధమైంది. జూన్ 30 నుంచి జూలై 13 వరకు మూడో సీజన్ జరగనుంది. ఈ క్రమంలో సోమవారం ఆంధ్రా ప్రీమియర్ లీగ్ సీజన్-3 కొత్త లోగో ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో క్రికెటర్లు కేఎస్ భరత్, నితీశ్కుమార్, రికీ భుయ్ లు పాల్గొని లోగోను ఆవిష్కరించారు.
ఆంధ్ర ప్రీమియర్ లీగ్ సీజన్-3 ప్రొఫెషనల్ గా సాగనుందని నిర్వాహకులు చెప్పారు. ఈ ప్రీమియం లీగ్ కి మన ఆంధ్ర-మన ఏపీఎల్ అనే ట్యాగ్ లైన్ తో తీసుకొని వస్తున్నట్లు వెల్లడించారు. గల్లిలో టాలెంట్ ఉన్న వారికి మంచి అవకాశం ఇచ్చి, రాష్ట్ర స్థాయికి తీసుకొని వస్తున్నామని, ఇప్పుడు లీగ్ మ్యాచ్ లు నిర్వహించడం చాలా ఖర్చుతో కూడుకున్నదని తెలిపారు.
ఐపీఎల్లో సన్రైజర్స్ హైదరాబాద్ తరుపున అదరగొట్టిన నితీశ్ రెడ్డి మాట్లాడుతూ.. తాను చాలా కింద స్థాయి నుంచి వచ్చినట్లు చెప్పాడు. ఆడటానికి మంచి అవకాశాలు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కల్పించిందన్నారు. ఆంధ్రా ప్రీమియర్ లీగ్ సీజన్స్ చాలా ఫేమస్ అయ్యాయని, చాలా మంది దీని గురించి అడిగినట్లు చెప్పారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..