బంగ్లాదేశ్ లో ఉగ్రవాదం పై పోరు
- June 11, 2016
లౌకికవాద ఉద్యమకారులపైనా, మైనార్టీలపైనా ఇటీవల బంగ్లాదేశ్లో దాడులు, హత్యలు పెచ్చరిల్లుతున్నాయి. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ పోలీసులు ఉగ్రవాద వ్యతిరేక డ్రైవ్ని ప్రారంభించారు. ఆ డ్రైవ్లో ఇప్పటి వరకు 1,700 మందిని అదుపులోకి తీసుకున్నామని వారు తెలిపారు. వారిలో నిషేధిత ఉగ్రవాద గ్రూపులకు చెందిన వారు కూడా కొంత మంది ఉన్నారని చెప్పారు. గురువారం సమావేశమైన పోలీసు ఉన్నతాధికారులంతా ఉగ్రవాద వ్యతిరేక డ్రైవ్ నిర్ణయాన్ని తీసుకున్నారని చెప్పారు. ఒక వారం పాటు ఈ డ్రైవ్ చేపట్టాలని నిర్ణయించుకున్నామని చెప్పారు.
అయితే శుక్రవారం ఒక్కరోజే బంగ్లాదేశ్ దేశ వ్యాప్తంగా 1,600 మందిని పట్టుకున్నామని చెప్పారు. శనివారం మరో 140 మంది వరకు దొరికారని తెలిపారు. దీంతో ఇప్పటి వరకు మొత్తం 1,740 మందిని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. అక్కడి రాజసాహి జిల్లా నుంచి 88 మందిని అదుపులోకి తీసుకుంటే వారిలో తొమ్మిది మంది ఉగ్రవాదులు ఉన్నట్లు గుర్తించామన్నారు. వారిలో ఎనిమిది మంది జమాతుల్ ముజాహిదీన్ బంగ్లాదేశ్(జేఎంబీ)కి చెందిన వారు కాగా మరొకరు జాగ్రతా ముస్లిం జనత బంగ్లాదేశ్(జేఎంజేబీ)కి చెందిన వారని చెప్పారు.
తాజా వార్తలు
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!







