200 మంది కార్మికులకు ఉచిత ఆరోగ్య పరీక్షలు
- June 11, 2024
దుబాయ్: మొబైల్ క్లినిక్లో 200 మందికి పైగా బ్లూ కాలర్ కార్మికులు ఉచిత ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నారు. 'వెల్నెస్ ఆన్ వీల్స్' దుబాయ్ ఆధారిత విశ్వవిద్యాలయం ప్రత్యేక విద్యా ప్రాజెక్టులో భాగంగా దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్ (డిఐపి) 2లోని నాఫ్కో క్యాంప్ 9కి చేరుకుంది. జార్జ్టౌన్ విశ్వవిద్యాలయం నుండి ఎగ్జిక్యూటివ్ MBA ప్రోగ్రామ్ విద్యార్థులు 'ఎథిక్స్ మాడ్యూల్' అనే ఎడ్యుకేషనల్ మాడ్యూల్ కోసం ఆరోగ్య సంరక్షణ రంగం నుండి వివిధ అధికారులతో కలిసి పనిచేస్తున్నారు. మొబైల్ క్లినిక్కు హాజరైన ఎనిమిది మంది వైద్యులలో ఒకరైన దుబాయ్ హెల్త్కు చెందిన డాక్టర్ డైయల్షామ్ మాట్లాడుతూ..కార్మికుల అనారోగ్యాల లక్షణాలను గుర్తించడంపై తాము ప్రధానంగా దృష్టి పెట్టామని చెప్పారు. అనంతరం లైఫ్ ఫార్మసీ అందించిన ఎలక్ట్రోలైట్స్, విటమిన్లు మరియు హైడ్రేషన్ ప్యాక్లు వంటి అవసరమైన సప్లిమెంట్లను కార్మికులకు పంపిణీ చేశారు. అరబిక్, ఇంగ్లీషు, హిందీ, ఉర్దూ, బెంగాలీ మరియు తగలోగ్ అనే ఆరు వేర్వేరు భాషల్లో ఆరోగ్య సంబంధిత సమాచారాన్ని కార్మికులకు అవగాహన కల్పించారు.
తాజా వార్తలు
- అత్యవసర సమయాల్లో పేరెంట్స్ బీ అలెర్ట్: ఖతార్
- మిడిల్ ఈస్ట్ కు పరిమితంగా ఇండియన్ ఎయిర్లైన్స్ ఫ్లైట్స్..!!
- కువైట్లో డ్రోన్ శకలాలు తగిలి 11 ఏళ్ల బాలిక మృతి..!!
- ఒమన్లో డ్రోన్లు, ఏరియల్ వస్తువుల పై అలెర్ట్ జారీ..!!
- యూఏఈలో మెడిసిన్ స్టాక్ పై ఆందోళన వద్దు..!!
- 9 డ్రోన్లను అడ్డుకొని ధ్వంసం చేశాము: సౌదీ
- ఎతిహాద్ రైల్ సాహసోపేత చర్య
- యూఏఈలోని యూఎస్ మిషన్లు క్లోజ్..!!
- ChatGPT ని వదిలేస్తున్న మిలియన్ల మంది యూజర్లు!
- భారతీయుల కోసం ప్రత్యేక హెల్ప్లైన్ నంబర్లు









