IAF విమానంలో 45 మంది భారతీయుల మృతదేహాలు తరలింపు
- June 14, 2024
కువైట్: కువైట్లో జరిగిన అగ్ని ప్రమాదంలో మరణించిన 45 మంది భారతీయుల మృతదేహాలను తీసుకుని భారత వైమానిక దళానికి చెందిన ప్రత్యేక C-130J రవాణా విమానం కువైట్ నుండి బయలుదేరింది. ఈ విమానం భారత కాలమానం ప్రకారం శుక్రవారం 10:30 గంటలకు కేరళలోని కొచ్చి చేరుకునే అవకాశం ఉంది. 23 మంది కేరళీయులు, తమిళనాడుకు చెందిన 7 మంది, కర్ణాటకకు చెందిన ఒకరి మృతదేహాన్ని కొచ్చి విమానాశ్రయంలో దింపనున్నారు. ఇతర రాష్ట్రాలకు చెందిన భారతీయుల మృతదేహాలను రవాణా చేయడానికి విమానం ఢిల్లీకి వెళ్తుంది. కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్, కువైట్ అధికారులతో సమన్వయం చేసి, మృతదేహాలను త్వరగా స్వదేశానికి తీసుకొచ్చారు.
కువైట్ లో బుధవారం జరిగిన అగ్ని ప్రమాదంలో మరణించిన 45 మంది భారతీయులలో ఇరవై మూడు మంది కేరళ వాసులు ఉన్నారు. భారత విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ జూన్ 13న కువైట్లోని ఆసుపత్రులను సందర్శించారు. అక్కడ మంగాఫ్లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదం తర్వాత చికిత్స పొందుతున్న భారతీయులతో సంభాషించారు.
తాజా వార్తలు
- గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయ స్థలాల పై AAI పరిశీలన..!
- అగ్నిపర్వతం బద్దలు..301 విమాన సర్వీసులకు అంతరాయం
- దుబాయ్లో మధ్యప్రదేశ్ ప్రత్యేక ODOP ఉత్పత్తుల ప్రదర్శన
- గ్రేటర్ పారిస్లో ‘నమస్తే’ శిల్పం ఆవిష్కరణ
- దుబాయ్లో అరబ్ పార్లమెంట్ అధ్యక్షుడితో మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ భేటీ
- ఎడారీకరణ నియంత్రణకు సౌదీ అరేబియా, కువైట్ సంయుక్త చర్యలు
- హిజ్రాల పై ఫిర్యాదులు.. స్పందించిన డీజీపీ సి.వి.ఆనంద్
- ఉన్నత విద్యలో సంస్కరణలు, పరిశోధనలకు ప్రాధాన్యమివ్వాలి: టి.గవర్నర్
- ఖతార్లో ప్రజలకు పోలీసుల సూచనలు..QID వెంట ఉంచుకోవాలి
- దుబాయ్ బతుకమ్మ వేడుకలకు కేటీఆర్కు ఆహ్వానం







