IAF విమానంలో 45 మంది భారతీయుల మృతదేహాలు తరలింపు
- June 14, 2024
కువైట్: కువైట్లో జరిగిన అగ్ని ప్రమాదంలో మరణించిన 45 మంది భారతీయుల మృతదేహాలను తీసుకుని భారత వైమానిక దళానికి చెందిన ప్రత్యేక C-130J రవాణా విమానం కువైట్ నుండి బయలుదేరింది. ఈ విమానం భారత కాలమానం ప్రకారం శుక్రవారం 10:30 గంటలకు కేరళలోని కొచ్చి చేరుకునే అవకాశం ఉంది. 23 మంది కేరళీయులు, తమిళనాడుకు చెందిన 7 మంది, కర్ణాటకకు చెందిన ఒకరి మృతదేహాన్ని కొచ్చి విమానాశ్రయంలో దింపనున్నారు. ఇతర రాష్ట్రాలకు చెందిన భారతీయుల మృతదేహాలను రవాణా చేయడానికి విమానం ఢిల్లీకి వెళ్తుంది. కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్, కువైట్ అధికారులతో సమన్వయం చేసి, మృతదేహాలను త్వరగా స్వదేశానికి తీసుకొచ్చారు.
కువైట్ లో బుధవారం జరిగిన అగ్ని ప్రమాదంలో మరణించిన 45 మంది భారతీయులలో ఇరవై మూడు మంది కేరళ వాసులు ఉన్నారు. భారత విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ జూన్ 13న కువైట్లోని ఆసుపత్రులను సందర్శించారు. అక్కడ మంగాఫ్లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదం తర్వాత చికిత్స పొందుతున్న భారతీయులతో సంభాషించారు.
తాజా వార్తలు
- యూఏఈలో కూరగాయల ధరల పెరుగుదల తాత్కాలికమే
- అమరావతి స్పోర్ట్స్ సిటీపై సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు!
- తెలంగాణలో సాయంత్రం పూట బీటెక్ కోర్సులు
- అన్ని రకాల డ్రోన్ల పై యూఏఈ నిషేధం..!!
- 684 మంది ఇంజనీర్లకు SR1.6 మిలియన్ల ఫైన్స్..!!
- 2 ఇండిగో విమానాలు దారి మళ్లింపు.. ప్రయాణికులు అసహనం..!!
- బహ్రెయిన్ లో ప్రవాస ఇంజనీర్ల అర్హతల పై సమీక్ష..!!
- సాయుధ దళాల ధైర్య సాహసాలను ప్రశంసించిన కౌన్సిల్..!!
- డ్రోన్ ఆపరేట్..పోలీసుల అదుపులో ఐదుగురు..!!
- కువైట్ పై ఆరు డ్రోన్లతో దాడి..కూల్చేసిన సైన్యం..!!









