IAF విమానంలో 45 మంది భారతీయుల మృతదేహాలు తరలింపు
- June 14, 2024
కువైట్: కువైట్లో జరిగిన అగ్ని ప్రమాదంలో మరణించిన 45 మంది భారతీయుల మృతదేహాలను తీసుకుని భారత వైమానిక దళానికి చెందిన ప్రత్యేక C-130J రవాణా విమానం కువైట్ నుండి బయలుదేరింది. ఈ విమానం భారత కాలమానం ప్రకారం శుక్రవారం 10:30 గంటలకు కేరళలోని కొచ్చి చేరుకునే అవకాశం ఉంది. 23 మంది కేరళీయులు, తమిళనాడుకు చెందిన 7 మంది, కర్ణాటకకు చెందిన ఒకరి మృతదేహాన్ని కొచ్చి విమానాశ్రయంలో దింపనున్నారు. ఇతర రాష్ట్రాలకు చెందిన భారతీయుల మృతదేహాలను రవాణా చేయడానికి విమానం ఢిల్లీకి వెళ్తుంది. కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్, కువైట్ అధికారులతో సమన్వయం చేసి, మృతదేహాలను త్వరగా స్వదేశానికి తీసుకొచ్చారు.
కువైట్ లో బుధవారం జరిగిన అగ్ని ప్రమాదంలో మరణించిన 45 మంది భారతీయులలో ఇరవై మూడు మంది కేరళ వాసులు ఉన్నారు. భారత విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ జూన్ 13న కువైట్లోని ఆసుపత్రులను సందర్శించారు. అక్కడ మంగాఫ్లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదం తర్వాత చికిత్స పొందుతున్న భారతీయులతో సంభాషించారు.
తాజా వార్తలు
- గుల్మార్గ్ గోండోలాలో తప్పిన పెను ప్రమాదం..300 మంది పర్యాటకులు క్షేమం
- ఏపీ ఎడ్సెట్ ఫలితాలు విడుదల..చెక్ చేసుకోవడం ఎలాగంటే?
- అమెరికా వీసా ఆశావహులకు గుడ్ న్యూస్
- ఢిల్లీలో 'పద్మ' పురస్కారాలు ప్రదానం చేసిన రాష్ట్రపతి ముర్ము... ...
- ప్రొఫెసర్ నాగేశ్వర్ పై కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం: కవిత
- ఈద్ అల్ అధా..HMC ఆపరేటింగ్ షెడ్యూల్ లో మార్పులు..!!
- కువైట్ లో 11,654 మంది కార్మికుల బదిలీలకు ఆమోదం..!!
- వైద్య సేవల కోసం మొదటి డ్రోన్ డెలివరీ అనుమతి జారీ..!!
- బౌషర్లో ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించి వెహికల్ చోరీ..!!
- వర్క్ ప్లేస్ లో కార్మికుడు మృతి..సూపర్వైజర్ కు జైలుశిక్ష..!!









