జెడ్డాలో భవనం కూలి ఏడుగురు మృతి..పలువురు అరెస్ట్
- June 15, 2024
జెడ్డా: జెడ్డాలో నివాస భవనం కూలిన ఘటనకు సంబంధించి అనేక మంది వ్యక్తులను అరెస్టు చేసినట్టు సౌదీ అరేబియా పర్యవేక్షణ మరియు అవినీతి నిరోధక అథారిటీ (నజాహా) వెల్లడించింది. ఈ దుర్ఘటనలో ఏడుగురు మరణించారని, మరో ఎనిమిది మందికి గాయాలు అయినట్లు తెలిపారు. మే 30 న జెద్దాలోని అల్-ఫైసాలియా పరిసరాల్లో నివాస భవనం కూలిపోవడంతో ఏడుగురు చనిపోగా, ఎనిమిది మంది గాయపడిన ఘటనపై అధికార యంత్రాంగం దర్యాప్తు ప్రారంభించింది. భవన నిర్మాణ అనుమతుల జారీలో అవినీతి అక్రమాలు చోటుచేసుకున్నట్లు సమాచారం అందడంతో విచారణ చేపట్టారు. ఈ ఘటనపై దర్యాప్తు చేసేందుకు మక్కా ప్రాంతానికి చెందిన ఎమిర్ ఏర్పాటు చేసిన కమిటీతో నజాహా అధికారులు విచారణ చేస్తున్నారు. భవనంలో సాంకేతిక లోపాలున్నట్లు విచారణలో తేలింది. మునిసిపాలిటీ భవన యజమాని ఫిరాస్ హనీ అల్ తుర్కీ, సాంస్కృతిక మంత్రిత్వ శాఖలోని భాగస్వామ్య సేవల డిప్యూటీ మంత్రిని నిర్మాణాన్ని నిలిపివేయమని ఆదేశించింది. కానీ అతను నిబంధనలు పాటించకుండా నిర్మాణం చేపట్టడంతో విషాదం చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి వ్యక్తులందరినీ అదుపులోకి తీసుకున్నామని, వారిపై చట్టపరమైన చర్యలు కొనసాగుతున్నాయని నజహా అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- మానవ అక్రమ రవాణా..మూడేళ్ల జైలుశిక్ష..!!
- ఇరాన్ డ్రోన్ దాడిలో దెబ్బతిన్న కువైట్ విద్యుత్ కేంద్రం..!!
- అల్ ఖబౌరాలో నీటమునిగి బాలుడు మృతి..!!
- 20 మిలియన్ దిర్హమ్ల గ్రాండ్ ప్రైజ్ గెలుచుకున్న భారతీయుడు..!!
- ఖతార్ లో పిల్లల భద్రతాకు మార్గదర్శకాలు జారీ..!!
- ఐఎమ్డి స్మార్ట్ సిటీ ఇండెక్స్లో 8 సౌదీ నగరాలు..!!
- ఇల్లు కొంటే మహిళల పేరుపైనే రిజిస్ట్రేషన్!
- IPL 2026: చెన్నై సూపర్ కింగ్స్ పై పంజాబ్ కింగ్స్ ఘన విజయం
- వణికిన ఉత్తర భారత్..ఢిల్లీలో భూకంపం!
- హైదరాబాద్ మెట్రో స్వాధీనం: ఏప్రిల్ 30 వరకు గడువు పొడిగింపు









