షాకింగ్: ‘ఇండియన్ 2’లో ‘ఆమె’ కూడానా.?
- June 17, 2024
శంకర్ తెరకెక్కించిన ప్రతిష్టాత్మక చిత్రాల్లో ఒకటి ‘ఇండియన్’. తెలుగులో ‘భారతీయుడు’ టైటిల్తో రిలీజయ్యింది. అప్పట్లో ఈ సినిమా ఓ సంచలనం. కాగా, ఇన్నేళ్ల తర్వాత మళ్లీ ఈ సినిమాకి సీక్వెల్ రూపొందిస్తున్నారు.
సీక్వెల్ తెరకెక్కించడం శంకర్కి కత్తి మీద సామే అయిన సంగతి అందరికీ తెలిసిందే. కష్టాలను ఓర్చి ఎట్టకేలకు ఈ సినిమా షూటింగ్ అయితే పూర్తి చేశారు డైరెక్టర్ శంకర్.
అలాగే జులై 12న రిలీజ్కి కూడా సిద్ధమైంది. కమల్ హాసన్తో పాటూ, సిద్దార్ధ్, రకుల్ ప్రీత్ సింగ్, కాజల్ అగర్వాల్ ఈ సినిమాలో ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్న సంగతి తెలిసిందే.
అయితే, తాజాగా అందుతోన్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో మనీషా కోయిరాల కూడా నటిస్తున్నట్లు తెలుస్తోంది. వెరీ లేటెస్ట్గా శంకర్తో మనీషా కోయిరాల దిగిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుండడమే ఈ న్యూస్ సర్క్యులేట్ కావడానికి కారణం.
‘ఇండియన్’ మొదటి పార్ట్లో మనీషా కోయిరాల తనదైన అందచందాలతో కుర్రోళ్లను కట్టి పడేసిన సంగతి తెలిసిందే. ఈ పార్ట్లో కూడా ఆమెను ఓ గెస్ట్ రోల్లో కొన్ని సెకన్ల పాటు చూపించబోతున్నారనీ, అయితే, ప్రస్తుతానికి ఆ క్యారెక్టర్ని సస్పెన్స్గా వుంచారనీ తెలుస్తోంది.
అన్నట్లు రీసెంట్గా ‘హీరామండి’ అనే వెబ్ సిరీస్లో మనీషా కోయిరాల స్టన్నింగ్ పర్ఫామెన్స్కి ఓటీటీ ఆడియన్స్ ఫిదా అయిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- తెలంగాణలో ₹1,000 కోట్ల స్టార్టప్ ఫండ్ ప్రకటించిన సీఎం రేవంత్
- తిరుమలలో మరో స్కామ్: నకిలీ పట్టు దుపట్టా మోసం
- మాలికి ట్రావెల్ బ్యాన్..వెంటనే తిరిగిరండి..!!
- ఒమన్ లో అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం..!!
- దర్బ్ అల్ సయ్ లో నేషనల్ డే కార్యకలాపాలు..!!
- సౌదీ అరేబియాలో సీజనల్ రెయిన్ ఫాల్..!!
- మనమా సౌక్.. మనమా ఆత్మ, హార్ట్ బీట్..!!
- కువైట్ చేరిన ఇండియన్ కోస్ట్ గార్డు షిప్ సర్థాక్..!!
- ఎన్నికల తేదీల కోసం జనాల ఎదురు చూపులు: కేటీఆర్
- దేశ ప్రజలకు ప్రధాని మోదీ కీలక విజ్ఞప్తి..!







