షాకింగ్: ‘ఇండియన్ 2’లో ‘ఆమె’ కూడానా.?
- June 17, 2024
శంకర్ తెరకెక్కించిన ప్రతిష్టాత్మక చిత్రాల్లో ఒకటి ‘ఇండియన్’. తెలుగులో ‘భారతీయుడు’ టైటిల్తో రిలీజయ్యింది. అప్పట్లో ఈ సినిమా ఓ సంచలనం. కాగా, ఇన్నేళ్ల తర్వాత మళ్లీ ఈ సినిమాకి సీక్వెల్ రూపొందిస్తున్నారు.
సీక్వెల్ తెరకెక్కించడం శంకర్కి కత్తి మీద సామే అయిన సంగతి అందరికీ తెలిసిందే. కష్టాలను ఓర్చి ఎట్టకేలకు ఈ సినిమా షూటింగ్ అయితే పూర్తి చేశారు డైరెక్టర్ శంకర్.
అలాగే జులై 12న రిలీజ్కి కూడా సిద్ధమైంది. కమల్ హాసన్తో పాటూ, సిద్దార్ధ్, రకుల్ ప్రీత్ సింగ్, కాజల్ అగర్వాల్ ఈ సినిమాలో ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్న సంగతి తెలిసిందే.
అయితే, తాజాగా అందుతోన్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో మనీషా కోయిరాల కూడా నటిస్తున్నట్లు తెలుస్తోంది. వెరీ లేటెస్ట్గా శంకర్తో మనీషా కోయిరాల దిగిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుండడమే ఈ న్యూస్ సర్క్యులేట్ కావడానికి కారణం.
‘ఇండియన్’ మొదటి పార్ట్లో మనీషా కోయిరాల తనదైన అందచందాలతో కుర్రోళ్లను కట్టి పడేసిన సంగతి తెలిసిందే. ఈ పార్ట్లో కూడా ఆమెను ఓ గెస్ట్ రోల్లో కొన్ని సెకన్ల పాటు చూపించబోతున్నారనీ, అయితే, ప్రస్తుతానికి ఆ క్యారెక్టర్ని సస్పెన్స్గా వుంచారనీ తెలుస్తోంది.
అన్నట్లు రీసెంట్గా ‘హీరామండి’ అనే వెబ్ సిరీస్లో మనీషా కోయిరాల స్టన్నింగ్ పర్ఫామెన్స్కి ఓటీటీ ఆడియన్స్ ఫిదా అయిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!
- ముబారక్ అల్-కబీర్ పోర్టు ఘటన..ఖండించిన కువైట్..!!
- అజర్బైజాన్లోని విమానాశ్రయం పై ఇరాన్ దాడి..!!
- మళ్లీ విమాన కార్యకలాపాలను నిలిపివేసిన బహ్రెయిన్..!!
- ఫైర్ వర్క్స్ పై పోలీసుల వార్న్..Dh100,000 ఫైన్, ఏడాది జైలు..!!









