మక్కా గ్రాండ్ మసీదు వద్ద 51.8°C ఉష్ణోగ్రతలు నమోదు
- June 18, 2024
సౌదీ: సౌదీ అరేబియా సోమవారం మక్కాలో ఉష్ణోగ్రత పెరుగుదల గురించి హెచ్చరించింది. ప్రపంచంలోని అతిపెద్ద మతపరమైన సమావేశాలలో హజ్ ఒకటి. ఆదివారం ఒక్కరోజే 2,700 కంటే ఎక్కువ "వేడి" సంబంధిత కేసులను నమోదు చేసినట్లు సౌదీ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. సోమవారం, సౌదీ వాతావరణ సేవ ప్రకారం, మక్కా గ్రాండ్ మసీదు వద్ద ఉష్ణోగ్రతలు 51.8 డిగ్రీల సెల్సియస్ (125 డిగ్రీల ఫారెన్హీట్)కి చేరుకున్నాయి. ఇక్కడ యాత్రికులు కాబా చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. సమీపంలోని మినాలో, ఉష్ణోగ్రత 46C అని జాతీయ వాతావరణ సేవ ప్రతినిధి చెప్పారు.
జోర్డాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆదివారం నాడు 14 మంది జోర్డాన్ యాత్రికులు వడదెబ్బకు గురై మరణించారని మరియు మరో 17 మంది ఆస్పత్రిలో చేరినట్టు తెలిపారు. ఐదుగురు యాత్రికుల మరణాలను ఇరాన్ నివేదించింది. అయితే కారణాన్ని పేర్కొనలేదు. సెనెగల్ విదేశాంగ మంత్రిత్వ శాఖ మరో ముగ్గురు మరణించినట్లు తెలిపింది. ప్రస్తుతం సౌదీ అరేబియాలో ఉన్న ఇండోనేషియా ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారి మాట్లాడుతూ.. హజ్ సమయంలో కనీసం ముగ్గురు హీట్ స్ట్రోక్తో సహా 136 మంది ఇండోనేషియా యాత్రికులు మరణించారని తెలిపారు.
తాజా వార్తలు
- రెండోసారి బిగ్ టికెట్ తోనే జాక్ పాట్ కొట్టిన కేరళ నర్సు..!!
- ఖతార్లో రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం..!!
- 459 మంది ఖైదీలకు ఒమన్ సుల్తాన్ క్షమాభిక్ష..!!
- సౌదీలో ఉరుములు, పిడుగులతో వర్షాలు.. 46 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!
- 200 కి.మీ వేగంతో కారు నడిపిన కువైట్ పౌరుడికి జైలుశిక్ష..!!
- మానవ అక్రమ రవాణా కేసు అప్పీల్పై విచారణ వాయిదా...!!
- ఫ్రాన్స్లో సౌదీ మద్దతుతో అతిపెద్ద థీమ్ పార్క్ ప్రాజెక్ట్..6 బిలియన్ యూరోల పెట్టుబడి..!!
- ఒమన్లో బెగ్గింగ్.. ఏడాది జైలు, OMR 100 ఫైన్..!!
- ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- కువైట్లో భారీ తనిఖీలు.. 67 కేసులు నమోదు..!!







