మక్కా గ్రాండ్ మసీదు వద్ద 51.8°C ఉష్ణోగ్రతలు నమోదు
- June 18, 2024
సౌదీ: సౌదీ అరేబియా సోమవారం మక్కాలో ఉష్ణోగ్రత పెరుగుదల గురించి హెచ్చరించింది. ప్రపంచంలోని అతిపెద్ద మతపరమైన సమావేశాలలో హజ్ ఒకటి. ఆదివారం ఒక్కరోజే 2,700 కంటే ఎక్కువ "వేడి" సంబంధిత కేసులను నమోదు చేసినట్లు సౌదీ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. సోమవారం, సౌదీ వాతావరణ సేవ ప్రకారం, మక్కా గ్రాండ్ మసీదు వద్ద ఉష్ణోగ్రతలు 51.8 డిగ్రీల సెల్సియస్ (125 డిగ్రీల ఫారెన్హీట్)కి చేరుకున్నాయి. ఇక్కడ యాత్రికులు కాబా చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. సమీపంలోని మినాలో, ఉష్ణోగ్రత 46C అని జాతీయ వాతావరణ సేవ ప్రతినిధి చెప్పారు.
జోర్డాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆదివారం నాడు 14 మంది జోర్డాన్ యాత్రికులు వడదెబ్బకు గురై మరణించారని మరియు మరో 17 మంది ఆస్పత్రిలో చేరినట్టు తెలిపారు. ఐదుగురు యాత్రికుల మరణాలను ఇరాన్ నివేదించింది. అయితే కారణాన్ని పేర్కొనలేదు. సెనెగల్ విదేశాంగ మంత్రిత్వ శాఖ మరో ముగ్గురు మరణించినట్లు తెలిపింది. ప్రస్తుతం సౌదీ అరేబియాలో ఉన్న ఇండోనేషియా ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారి మాట్లాడుతూ.. హజ్ సమయంలో కనీసం ముగ్గురు హీట్ స్ట్రోక్తో సహా 136 మంది ఇండోనేషియా యాత్రికులు మరణించారని తెలిపారు.
తాజా వార్తలు
- మానవ అక్రమ రవాణా..మూడేళ్ల జైలుశిక్ష..!!
- ఇరాన్ డ్రోన్ దాడిలో దెబ్బతిన్న కువైట్ విద్యుత్ కేంద్రం..!!
- అల్ ఖబౌరాలో నీటమునిగి బాలుడు మృతి..!!
- 20 మిలియన్ దిర్హమ్ల గ్రాండ్ ప్రైజ్ గెలుచుకున్న భారతీయుడు..!!
- ఖతార్ లో పిల్లల భద్రతాకు మార్గదర్శకాలు జారీ..!!
- ఐఎమ్డి స్మార్ట్ సిటీ ఇండెక్స్లో 8 సౌదీ నగరాలు..!!
- ఇల్లు కొంటే మహిళల పేరుపైనే రిజిస్ట్రేషన్!
- IPL 2026: చెన్నై సూపర్ కింగ్స్ పై పంజాబ్ కింగ్స్ ఘన విజయం
- వణికిన ఉత్తర భారత్..ఢిల్లీలో భూకంపం!
- హైదరాబాద్ మెట్రో స్వాధీనం: ఏప్రిల్ 30 వరకు గడువు పొడిగింపు









