మక్కా గ్రాండ్ మసీదు వద్ద 51.8°C ఉష్ణోగ్రతలు నమోదు
- June 18, 2024
సౌదీ: సౌదీ అరేబియా సోమవారం మక్కాలో ఉష్ణోగ్రత పెరుగుదల గురించి హెచ్చరించింది. ప్రపంచంలోని అతిపెద్ద మతపరమైన సమావేశాలలో హజ్ ఒకటి. ఆదివారం ఒక్కరోజే 2,700 కంటే ఎక్కువ "వేడి" సంబంధిత కేసులను నమోదు చేసినట్లు సౌదీ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. సోమవారం, సౌదీ వాతావరణ సేవ ప్రకారం, మక్కా గ్రాండ్ మసీదు వద్ద ఉష్ణోగ్రతలు 51.8 డిగ్రీల సెల్సియస్ (125 డిగ్రీల ఫారెన్హీట్)కి చేరుకున్నాయి. ఇక్కడ యాత్రికులు కాబా చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. సమీపంలోని మినాలో, ఉష్ణోగ్రత 46C అని జాతీయ వాతావరణ సేవ ప్రతినిధి చెప్పారు.
జోర్డాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆదివారం నాడు 14 మంది జోర్డాన్ యాత్రికులు వడదెబ్బకు గురై మరణించారని మరియు మరో 17 మంది ఆస్పత్రిలో చేరినట్టు తెలిపారు. ఐదుగురు యాత్రికుల మరణాలను ఇరాన్ నివేదించింది. అయితే కారణాన్ని పేర్కొనలేదు. సెనెగల్ విదేశాంగ మంత్రిత్వ శాఖ మరో ముగ్గురు మరణించినట్లు తెలిపింది. ప్రస్తుతం సౌదీ అరేబియాలో ఉన్న ఇండోనేషియా ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారి మాట్లాడుతూ.. హజ్ సమయంలో కనీసం ముగ్గురు హీట్ స్ట్రోక్తో సహా 136 మంది ఇండోనేషియా యాత్రికులు మరణించారని తెలిపారు.
తాజా వార్తలు
- ఖతార్ లో 25 కొత్త ఎలక్ట్రానిక్ సేవలు ప్రారంభం..!!
- సౌదీ అరేబియాలో బలమైన గాలులు, భారీ వర్షాలు..!!
- గిన్నిస్ రికార్డ్ అటెంప్ట్.. RAK తీరప్రాంతంలో 15 నిమిషాల ఫైర్ వర్క్స్..!!
- ఇండిగోకు KWD 448,793 ట్యాక్స్ నోటీసులు..!!
- ఒమన్ లో 'రియల్ బెనిఫిషియరీ సర్వీస్' ప్రారంభం..!!
- మారాయీ 2025.. ఫాల్కన్లు, సలుకీలుపై స్పాట్లైట్..!!
- మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ జయంతి సందర్భంగా..సీఎం రేవంత్ నివాళులు..
- పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్ చేయాలి: సోనుసూద్
- ఈ నెల 18న గవర్నర్ను కలవనున్న జగన్
- కూటమి పాలనలో ఎన్నో విజయాలు సాధించాం: మంత్రి పార్థసారధి







