ఒమన్ లో 130కి పైగా వాణిజ్య సంస్థలకు నోటీసులు

- July 03, 2024 , by Maagulf
ఒమన్ లో 130కి పైగా వాణిజ్య సంస్థలకు నోటీసులు

మస్కట్: ఖరీఫ్ ధోఫర్ 2024 సీజన్‌ నేపథ్యంలో వాణిజ్య పరిశ్రమలు ప్రమోషన్ మంత్రిత్వ శాఖ తనిఖీ విభాగం పలు ప్రాంతాల్లో తనిఖీలు చేపడుతోంది. దుకాణాలు మరియు ఫిల్లింగ్ స్టేషన్‌లపై దాడులు నిర్వహించింది. నిబంధనల ప్రకారం.. ఎలక్ట్రానిక్ చెల్లింపు పరికరాన్ని అందించడంలో విఫలమైన 131 వాణిజ్య సంస్థలకు నోటీసులు జారీ చేశారు. మంత్రిత్వ శాఖ తనిఖీ విభాగం ఆడమ్-హైమా-తుమ్రైత్ లైన్, మహౌత్ సలాలా రోడ్ మరియు దోఫర్ గవర్నరేట్‌లో ఉన్న అనేక ఇంధన స్టేషన్‌లను సందర్శించింది. మొత్తం 59 గ్యాస్ స్టేషన్‌లను తనిఖీ చేశారు. ప్రమాణాలు పాటించడంలో విఫలమైనందుకు 10 స్టేషన్‌లకు హెచ్చరికలు జారీ చేశారు.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com