మూన్ దీవిలో డైవర్ ను కాపాడిన రాయల్ ఫ్యామిలీ మెంబర్..!
- July 03, 2024
యూఏఈ: అగ్రశ్రేణి ఫ్రీడైవింగ్ నిపుణులలో ఒకరైన జరీర్ సైఫుద్దీన్..ఇటీవలి ఫ్రీడైవింగ్ మరియు స్పియర్ ఫిషింగ్ ట్రిప్లో మరణానికి చేరువగా వెళ్లి ప్రాణాలతో బయటపడ్డాడు. ఫ్రీడైవింగ్ అనేది డైవర్లు స్కూబా పరికరాలను ఉపయోగించని టెక్నిక్. వారు సముద్రంలో లోతుగా డైవ్ చేస్తారు. వారు వీలైనంత కాలం శ్వాసను బిగపట్టి డైవ్ చేస్తారు. ఈ సాంకేతికత పెర్ల్ డైవింగ్ పురాతన సంప్రదాయంలో వాడుకలో ఉంది.
ప్రత్యక్ష సాక్షుల ప్రకారం.. జరీర్ ఒడ్డు నుండి అనేక కిలోమీటర్ల దూరంలో తన స్నేహితులతో డైవింగ్ ట్రిప్లో ఉన్నప్పుడు స్పృహ కోల్పోయి దాదాపు మునిగిపోయాడు. అతని స్నేహితులు, సహాయం కోసం కేకలు వేశారు. అతన్ని దుబాయ్ తీరానికి 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న మూన్ ఐలాండ్కు దగ్గరగా తరలించారు. అప్పటికే ఊపిరితిత్తులు నీళ్లతో నిండిపోవడంతో సెమీ స్పృహలో ఉన్నట్లు వారు తెలిపారు. అదృష్టవశాత్తూ దుబాయ్ రాజకుటుంబానికి చెందిన సభ్యుడు సమీపంలో ఉన్నాడు. అతడిని రక్షించడంలో సహాయం చేయడానికి అతని వ్యక్తిగత వైద్య బృందాన్ని పురమాయించాడు. అనంతరం మూన్ ఐలాండ్ నుండి దుబాయ్ పోలీసు హెలికాప్టర్ ద్వారా ఫ్రీడైవర్ను వెంటనే రషీద్ హాస్పిటల్ కు తరలించారు. తనను కాపాడిన ప్రతి ఒక్కరికి జరీర్ ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యంగా తనకు సకాలంలో వైద్యం అందించి ప్రాణాలను రక్షించిన రాయల్ ఫ్యామిలీ మెంబర్ కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.
తాజా వార్తలు
- ఢిల్లీ క్యాపిటల్స్ చారిత్రాత్మక విజయం..
- TANA ప్రపంచసాహిత్యవేదిక 6వ వార్షికోత్సవం
- బిగ్ టికెట్ ఈ-డ్రాలో నలుగురు భారతీయులకు అదృష్టం..
- మలేషియాలో అక్రమ వలసదారులకు ఊరట..
- EC నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టు కు మమతా బెనర్జీ
- RTC కార్మికులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్
- పసుపు క్వింటాల్ కు రూ.16 వేల మద్దతు ధర ప్రకటించాలి: కవిత
- వైజాగ్ ఫుడ్ లవర్స్ కి గుడ్ న్యూస్..
- పెట్రోల్, డీజిల్ ధరల పై బాంబు పేల్చిన కేంద్ర ప్రభుత్వం
- జాతీయ సమైక్యతకు ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’ కీలకం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా









