హత్య కేసులో నిందితుడైన కొడుకు.. కోర్టును ఆశ్రయించిన తండ్రి
- July 03, 2024
దుబాయ్: హత్యకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న తన కుమారుడిని సంబంధిత అధికారులకు నివేదించడంలో విఫలమైనందుకు ఆస్ట్రేలియాకు చెందిన ఓ తండ్రి దుబాయ్ కోర్టును ఆశ్రయించాడు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ల ప్రకారం..అక్టోబర్ 6న తన కొడుకు తన స్నేహితుడిని చంపాడు. ఈ విషయం అతనికి తెలుసని, ఈ ఘటనపై దుబాయ్ క్రిమినల్ కోర్టుకు ఫిర్యాదు చేశారు.
షార్జాలో హంతకుడిని అరెస్టు చేశారు. తదుపరి విచారణలో అతని తండ్రికి నేరం గురించి తెలిసినప్పటికీ, అధికారులకు నివేదించలేదని తేలింది. విచారణ ప్రకారం.. ఆస్ట్రేలియాలో నివాసం ఉంటున్న తన మరో కుమారుడు షార్జాలో హోటల్ గదిని, నిందితుడైన కుమారుడికి విమాన టిక్కెట్టును ఏర్పాటు చేసినట్లు తండ్రికి తెలుసని అధికారులు విచారణలో గుర్తించారు.
మరోవైపు హత్య గురించి తెలియక తనను అపార్ట్మెంట్కు పిలిపించారని విచారణలో తండ్రి చెప్పాడు. ఇదే విషయమై అతని కుమారుడిని అడగడంతో, అతడు తనను కట్టివేశాడని పేర్కొన్నాడు. నేరాన్ని అధికారులకు నివేదించడంలో విఫలమయ్యాడనే ఆరోపణను తండ్రి ఖండించాడు. అతను తన కొడుకును చూసి షాక్ అయ్యాడని, భయభ్రాంతులకు గురిచేశాడని, ఇది నేరాన్ని నివేదించకుండా చేసిందని తెలిపాడు.
శిక్షాస్మృతిలోని ఆర్టికల్ 323ని ప్రస్తావిస్తూ, నేరాన్ని నివేదించడంలో విఫలమైతే ఒక సంవత్సరం వరకు జైలు శిక్ష లేదా జరిమానా విధించబడుతుందని కోర్టు స్పష్టం చేసింది. నిందితుడితో తండ్రికి ఉన్న సంబంధం మరియు అతని వయసు దృష్టిలో ఉంచుకుని, అతనిని శిక్ష నుండి మినహాయించేందుకు ఆర్టికల్ 323 ప్రకారం కోర్టు తన విచక్షణాధికారాన్ని కోర్టు వినియోగించుకుంది. ఈ కేసులో తండ్రిని నిర్దోషిగా విడుల చేస్తున్నట్లు కోర్టు తెలిపింది.
తాజా వార్తలు
- యూఏఈలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న తుంబే ల్యాబ్స్.. అంతర్జాతీయ ISO గుర్తింపు సాధన
- దుబాయ్ పోలీస్–భారత కాన్సులేట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు
- కువైట్ లో గోల్డ్ ట్రేడ్ రూల్స్ కఠినతరం..!!
- మనమాలో 'ఇమామ్ హుస్సేన్ మెడికల్ క్లినిక్' ప్రారంభం..!!
- సౌత్ అల్ బతినా సమ్మర్ ఫోరమ్ కార్యకలాపాలు ప్రారంభం..!!
- 1 ట్రిలియన్ దిర్హమ్లను దాటిన దుబాయ్ బ్రాండ్ వాల్యూ..!!
- సముద్రంలో ఇద్దరిని రక్షించిన బోర్డర్ గార్డ్స్..!!
- రిటర్న్ టికెట్లతో దుబాయ్లో ఉచిత హోటల్ బస..ఎమిరేట్స్ ప్రత్యేక సమ్మర్ ఆఫర్
- NEET పునఃపరీక్షలో మొత్తం 30 మంది అరెస్టు
- ఖతార్లో భారీ పేలుడు: 54 మందికి గాయాలు, 18 మంది గల్లంతు







