దివంగత నేత వైఎస్ఆర్కు కుటుంబ సభ్యుల ఘన నివాళులు
- July 08, 2024
అమరావతి: నేడు దివంగత నేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి 75 వ జయంతి. ఈ సందర్భంగా కడప జిల్లా ఇడుపులపాయలో వైఎస్సార్ జయంతి వేడుకలు అట్టహాసంగా జరుగుతున్నాయి. వైఎస్సార్ ఘాట్ దగ్గర వైఎస్ జగన్ దంపతులు, విజయలక్ష్మి నివాళులర్పించారు.
అనంతరం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు, శ్రేణులు పాల్గొన్నారు. రాజశేఖర్ రెడ్డి అమర్ రహే అంటూ నినాదాలు చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేసిన సేవలను గుర్తు తెచ్చుకున్నారు.
కాగా, తండ్రి జయంతిపై వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. ‘కోట్లాది కుటుంబాలు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాయి. మీ పుట్టిన రోజు సందర్భంగా వైసీపీ నాయకులు, కార్యకర్తలు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ప్రజా సేవకు మీరు చూపిన మార్గం మాకు శిరోధార్యం. మీ ధైర్యసాహసాలు, కఠోర శ్రమ, క్రమశిక్షణ మాకు మార్గం. మీ ఆశయాలే లక్ష్యంగా పని చేస్తాం. ప్రజల క్షేమం కోసం చివరి వరకూ కృషి చేస్తాం.’ అంటూ ట్వీట్ చేశారు.
తాజా వార్తలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..







