భారతీయ ప్రముఖ వ్యాపారవేత్త రామ్ బుక్సానీ కన్నుమూత
- July 08, 2024
దుబాయ్: ప్రముఖ భారతీయ వ్యాపారవేత్త డాక్టర్ రామ్ బుక్సానీ దుబాయ్లో కన్నుమూశారు. ఆయన వయసు 83. ఆదివారం తెల్లవారుజామున 1 గంట ప్రాంతంలో తన ఇంట్లో ఆయన మరణించారు. తన 18 సంవత్సరాల వయస్సులో నవంబర్ 1959లో దుబాయ్లో అడుగుపెట్టాడు. అనంతరం అంచలంచెలుగా ఎదుగుతూ ప్రముఖ వ్యాపారవేత్తగా గుర్తింపు పొందారు.
డాక్టర్ బుక్సాని వివిధ కంపెనీల్లో వివిధ హోదాలలో పనిచేశారు. రోటరీ క్లబ్ ఆఫ్ జుమేరా (దుబాయ్) అధ్యక్షుడిగా, ఇండియన్ హైస్కూల్ ఛైర్మన్గా సేవలు అందించారు. 1953లో ఇంటర్నేషనల్ ట్రేడర్స్ (ఈస్ట్ ఆఫ్రికా)ని స్థాపించారు. తర్వాత ఇంటర్నేషనల్ ట్రేడర్స్ (ME) లిమిటెడ్ అని పేరు మార్చారు. కాస్మోస్ మొదటి షోరూమ్ 1969లో దీరాలో ప్రారంభమైంది. అనంతరం డాక్టర్ బక్సాని గ్రూప్ ఆతిథ్య రంగంలోకి ప్రవేశించింది. అంబాసిడర్ హోటల్, దీరా మరియు ఆస్టోరియా హోటల్లో వాటాలను కొనుగోలు చేసింది. ITL కాస్మోస్ గ్రూప్ తరువాత F&B రంగంలోకి ప్రవేశించి క్వాలిటీ ఐస్ క్రీమ్ను ప్రారంభించింది.
తాజా వార్తలు
- కోరమాండల్ కాకినాడ ప్లాంట్కు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు
- ఇఫ్తార్ విందులో సీఎం చంద్రబాబు...
- Oscars 2026 winners : ఆస్కార్ అవార్డ్స్ 2026, విజేతల పూర్తి వివరాలు
- ఐపీఎల్ 2026: 10 జట్ల కెప్టెన్ల వివరాలు ఇవే!
- సినీ నటి ప్రత్యూష ఆత్మహత్య కేసు..కోర్టులో లొంగిపోయిన సిద్ధార్ధ రెడ్డి
- అమరావతిలో పొట్టి శ్రీరాములు విగ్రహం..
- ఫుజైరా పెట్రోలియం కేంద్రం పై డ్రోన్ దాడి: అదుపులో మంటలు..
- జెడ్డా ఎఫ్1 గ్రాండ్ ప్రిక్స్ వాయిదా..!!
- ఈద్ సెలవులలో భద్రతా చర్యలు పాటించాలి: ROP
- డెలివరీ ప్లాట్ఫామ్లలో పొగాకు, సిగరెట్ల అమ్మకాల పై నిషేధం..!!









