ఓటీటీలో త్రిష .! విశ్వరూపం చూపించబోతోందిగా.!
- July 09, 2024
వెండితెరపై అద్భుతాలు సృష్టించిన కొందరు నటీ నటులు ఇప్పుడు ఓటీటీ తెరపైనా సందడి చేసేందుకు సిద్ధమవుతున్నారు. నిజానికి మొదట్లో వెండితెరపై ఫామ్లో లేని నటీ నటులే ఓటీటీ తెరపై కనిపించేవారు కొత్తగా సరికొత్తగా.
అలా ఎంతో మందికి ఓటీటీ ఓ మంచి టాలెంటెడ్ ప్లాట్పామ్ అవుతోందని సంబరపడ్డారు. ఆ తర్వాత మెల్ల మెల్లగా ఓటీటీకి ప్రేక్షకులు బాగా అలవాటు పడ్డారు. ఎంతలా అంటే, ధియేటర్లకు పోయి సినిమాలు చూడడం మానేసేంతలా.!
దాంతో ఫామ్లో లేని నటీ నటులే కాదు, సీనియర్ ప్రముఖ స్టార్లు కూడా ఓటీటీ కంటెంట్పై ఫోకస్ పెడుతున్నారు. అలా ఇప్పటికే ముద్దుగుమ్మలో తమన్నా, కాజల్, సమంత, బాలీవుడ్ నుంచి కూడా ప్రియాంకా చోప్రా తదితరులు ఓటీటీలో సత్తా చూపించారు. చూపిస్తున్నారు కూడా.
ఇక ఇప్పుడు సీనియర్ నటి త్రిష కూడా ఓటీటీలో సందడి చేయబోతోంది. త్రిష నటించిన ‘బృందా’ అనే వెబ్ సిరీస్ త్వరలో ఓటీటీలో సందడి చేయబోతోంది. ఈ సిరీస్కి సంబంధించిన టీజర్ లేటెస్ట్గా రిలీజైంది. క్రైమ్ ఇన్వెస్టిగేషన్ నేపథ్యంలో రూపొందిన ఈ వెబ్ సిరీస్లో త్రిష తన నటనతో ఎలాంటి కొత్తదనం చూపించబోతోందో చూడాలి మరి.
తాజా వార్తలు
- లూలూ హైపర్ మార్కెట్ లో షాప్ నౌ, పే లేటర్..!!
- అల్ సువైఖ్లో ఇద్దరు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- మాల్స్ పార్కింగ్ ఏరియాల్లో గాలి నాణ్యతపై కీలక అప్డేట్..!!
- కంపెనీలు ఉద్యోగుల తొలగింపులను నివారించవచ్చా?
- మహమ్మారి సమయంలో జన్మించిన పిల్లలకు అడ్మిషన్లు..!!
- గల్ఫ్ పెట్రో కెమికల్ ఇండస్ట్రీస్ కంపెనీ యూనిట్ల పై దాడులు..!!
- అమరావతికి చట్టబద్ధత: సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్ఆర్ఐ టీడీపీ సంబరాలు
- కువైట్ ప్రభుత్వ మంత్రిత్వ శాఖల సముదాయం పై డ్రోన్ దాడి
- తెలంగాణ ప్రజలకు అలెర్ట్..
- ఏపీ హై కోర్ట్: విదేశాలకు వెళ్లిన అర్చకులు గర్భగుడిలోకి వెళ్లకూడదు









