ఓటీటీలో త్రిష .! విశ్వరూపం చూపించబోతోందిగా.!
- July 09, 2024
వెండితెరపై అద్భుతాలు సృష్టించిన కొందరు నటీ నటులు ఇప్పుడు ఓటీటీ తెరపైనా సందడి చేసేందుకు సిద్ధమవుతున్నారు. నిజానికి మొదట్లో వెండితెరపై ఫామ్లో లేని నటీ నటులే ఓటీటీ తెరపై కనిపించేవారు కొత్తగా సరికొత్తగా.
అలా ఎంతో మందికి ఓటీటీ ఓ మంచి టాలెంటెడ్ ప్లాట్పామ్ అవుతోందని సంబరపడ్డారు. ఆ తర్వాత మెల్ల మెల్లగా ఓటీటీకి ప్రేక్షకులు బాగా అలవాటు పడ్డారు. ఎంతలా అంటే, ధియేటర్లకు పోయి సినిమాలు చూడడం మానేసేంతలా.!
దాంతో ఫామ్లో లేని నటీ నటులే కాదు, సీనియర్ ప్రముఖ స్టార్లు కూడా ఓటీటీ కంటెంట్పై ఫోకస్ పెడుతున్నారు. అలా ఇప్పటికే ముద్దుగుమ్మలో తమన్నా, కాజల్, సమంత, బాలీవుడ్ నుంచి కూడా ప్రియాంకా చోప్రా తదితరులు ఓటీటీలో సత్తా చూపించారు. చూపిస్తున్నారు కూడా.
ఇక ఇప్పుడు సీనియర్ నటి త్రిష కూడా ఓటీటీలో సందడి చేయబోతోంది. త్రిష నటించిన ‘బృందా’ అనే వెబ్ సిరీస్ త్వరలో ఓటీటీలో సందడి చేయబోతోంది. ఈ సిరీస్కి సంబంధించిన టీజర్ లేటెస్ట్గా రిలీజైంది. క్రైమ్ ఇన్వెస్టిగేషన్ నేపథ్యంలో రూపొందిన ఈ వెబ్ సిరీస్లో త్రిష తన నటనతో ఎలాంటి కొత్తదనం చూపించబోతోందో చూడాలి మరి.
తాజా వార్తలు
- గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయ స్థలాల పై AAI పరిశీలన..!
- అగ్నిపర్వతం బద్దలు..301 విమాన సర్వీసులకు అంతరాయం
- దుబాయ్లో మధ్యప్రదేశ్ ప్రత్యేక ODOP ఉత్పత్తుల ప్రదర్శన
- గ్రేటర్ పారిస్లో ‘నమస్తే’ శిల్పం ఆవిష్కరణ
- దుబాయ్లో అరబ్ పార్లమెంట్ అధ్యక్షుడితో మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ భేటీ
- ఎడారీకరణ నియంత్రణకు సౌదీ అరేబియా, కువైట్ సంయుక్త చర్యలు
- హిజ్రాల పై ఫిర్యాదులు.. స్పందించిన డీజీపీ సి.వి.ఆనంద్
- ఉన్నత విద్యలో సంస్కరణలు, పరిశోధనలకు ప్రాధాన్యమివ్వాలి: టి.గవర్నర్
- ఖతార్లో ప్రజలకు పోలీసుల సూచనలు..QID వెంట ఉంచుకోవాలి
- దుబాయ్ బతుకమ్మ వేడుకలకు కేటీఆర్కు ఆహ్వానం







