ఓటీటీలో త్రిష .! విశ్వరూపం చూపించబోతోందిగా.!
- July 09, 2024
వెండితెరపై అద్భుతాలు సృష్టించిన కొందరు నటీ నటులు ఇప్పుడు ఓటీటీ తెరపైనా సందడి చేసేందుకు సిద్ధమవుతున్నారు. నిజానికి మొదట్లో వెండితెరపై ఫామ్లో లేని నటీ నటులే ఓటీటీ తెరపై కనిపించేవారు కొత్తగా సరికొత్తగా.
అలా ఎంతో మందికి ఓటీటీ ఓ మంచి టాలెంటెడ్ ప్లాట్పామ్ అవుతోందని సంబరపడ్డారు. ఆ తర్వాత మెల్ల మెల్లగా ఓటీటీకి ప్రేక్షకులు బాగా అలవాటు పడ్డారు. ఎంతలా అంటే, ధియేటర్లకు పోయి సినిమాలు చూడడం మానేసేంతలా.!
దాంతో ఫామ్లో లేని నటీ నటులే కాదు, సీనియర్ ప్రముఖ స్టార్లు కూడా ఓటీటీ కంటెంట్పై ఫోకస్ పెడుతున్నారు. అలా ఇప్పటికే ముద్దుగుమ్మలో తమన్నా, కాజల్, సమంత, బాలీవుడ్ నుంచి కూడా ప్రియాంకా చోప్రా తదితరులు ఓటీటీలో సత్తా చూపించారు. చూపిస్తున్నారు కూడా.
ఇక ఇప్పుడు సీనియర్ నటి త్రిష కూడా ఓటీటీలో సందడి చేయబోతోంది. త్రిష నటించిన ‘బృందా’ అనే వెబ్ సిరీస్ త్వరలో ఓటీటీలో సందడి చేయబోతోంది. ఈ సిరీస్కి సంబంధించిన టీజర్ లేటెస్ట్గా రిలీజైంది. క్రైమ్ ఇన్వెస్టిగేషన్ నేపథ్యంలో రూపొందిన ఈ వెబ్ సిరీస్లో త్రిష తన నటనతో ఎలాంటి కొత్తదనం చూపించబోతోందో చూడాలి మరి.
తాజా వార్తలు
- కువైట్పై క్షిపణి, డ్రోన్ దాడులు..అప్రమత్తమైన వైమానిక రక్షణ వ్యవస్థ
- ఈద్ అల్ అదా డ్రా.. Dh30 మిలియన్ల విజేతను ప్రకటించిన యూఏఈ లాటరీ..!!
- ఐక్యరాజ్యసమితి చార్టర్ సూత్రాలపై చర్చ..బహ్రెయిన్ కీలక సూచనలు..!!
- 50% వరకు తగ్గింపు: యూఏఈ ప్రయాణికులకు చౌకైన టిక్కెట్లు ..!!
- ఈద్ అల్-అధా..బలి ఆచారాన్ని నిర్వహించిన కువైటీలు..!!
- తీవ్ర అస్వస్థత..ఈజిప్ట్ నుండి విమానంలో సౌదీ పౌరుల తరలింపు..!!
- 2026లో నిలకడగా ఖతార్ హాస్పిటాలిటీ సెక్టర్..!!
- ఎలిమినేటర్లో హైదరాబాద్కు బిగ్ షాక్..
- ఫైటర్ జెట్ల తయారీకి గ్రీన్ సిగ్నల్
- ఎవరెస్ట్ శిఖరం పై హైదరాబాదీ మృతి..









