‘ఇండియన్ 2’లో ఆ అద్భుతాలున్నాయట.!
- July 09, 2024
దాదాపు 30 ఏళ్ల క్రితం సంచలన విజయం అందుకున్న సినిమా ‘భారతీయుడు’. ఆ సినిమాకి ఇన్నేళ్ల తర్వాత సీక్వెల్ రూపొందించారు. ఈ సీక్వెల్ రూపొందించడానికి దాదాపు ఆరేళ్లు సమయం పట్టింది. ఇది చిన్న విషయం కాదు.
ఈ టైమ్లో టీమ్ ఎదుర్కొన్న సమస్యలు అన్నీ ఇన్నీ కావు. ఓ వైపు కోవిడ్, లాక్డౌన్, అగ్ని ప్రమాదం జరిగి ఇద్దరు టెక్నీషియన్ల మరణం.. ఆ తర్వాత కూడా కొన్ని అనారోగ్యాల కారణంగా కొందరు ఆర్టిస్టులు కూడా మరణించారు ఈ సినిమాకి సంబంధించి.
వాళ్లలో నెడుమూడి వేణు, వివేక్ వున్నారు. ఈ నటుల పాత్రలకు సంబంధించి కొంతమేర షూటింగ్ చేశారు. ఆ తర్వాత వారు మరణించారు. వారికి సంబంధించిన పెండింగ్ సన్నివేశాల్ని ఆధునిక టెక్నాలజీ యూజ్ చేసి చిత్రీకరించారట.
సాధారణంగా అయితే, పాత సీన్లు తీసేసి కొత్త నటుల్ని పెట్టుకుని రీ షూట్ చేయొచ్చు. కానీ, శంకర్ అండ్ టీమ్ అలా చేయలేదు. వారి గుర్తుగా ఆయా సన్నివేశాలను అలాగే వుంచేశారట. అవసరమైన మరికొన్ని సన్నివేశాలను టెక్నాలజీ సాయంతో చిత్రీకరించారట. నిజంగా ఇదో అద్భుతమే అని చెప్పాలి. ఇలాంటి ఎన్నో అద్భుతాలకు నెలవైన ‘ఇండియన్ 2’ చిత్రం ఈ నెల 12న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రపంచం మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోంది ఈ సినిమాని వీక్షించేందుకు.
తాజా వార్తలు
- గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయ స్థలాల పై AAI పరిశీలన..!
- అగ్నిపర్వతం బద్దలు..301 విమాన సర్వీసులకు అంతరాయం
- దుబాయ్లో మధ్యప్రదేశ్ ప్రత్యేక ODOP ఉత్పత్తుల ప్రదర్శన
- గ్రేటర్ పారిస్లో ‘నమస్తే’ శిల్పం ఆవిష్కరణ
- దుబాయ్లో అరబ్ పార్లమెంట్ అధ్యక్షుడితో మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ భేటీ
- ఎడారీకరణ నియంత్రణకు సౌదీ అరేబియా, కువైట్ సంయుక్త చర్యలు
- హిజ్రాల పై ఫిర్యాదులు.. స్పందించిన డీజీపీ సి.వి.ఆనంద్
- ఉన్నత విద్యలో సంస్కరణలు, పరిశోధనలకు ప్రాధాన్యమివ్వాలి: టి.గవర్నర్
- ఖతార్లో ప్రజలకు పోలీసుల సూచనలు..QID వెంట ఉంచుకోవాలి
- దుబాయ్ బతుకమ్మ వేడుకలకు కేటీఆర్కు ఆహ్వానం







