‘ఇండియన్ 2’లో ఆ అద్భుతాలున్నాయట.!
- July 09, 2024
దాదాపు 30 ఏళ్ల క్రితం సంచలన విజయం అందుకున్న సినిమా ‘భారతీయుడు’. ఆ సినిమాకి ఇన్నేళ్ల తర్వాత సీక్వెల్ రూపొందించారు. ఈ సీక్వెల్ రూపొందించడానికి దాదాపు ఆరేళ్లు సమయం పట్టింది. ఇది చిన్న విషయం కాదు.
ఈ టైమ్లో టీమ్ ఎదుర్కొన్న సమస్యలు అన్నీ ఇన్నీ కావు. ఓ వైపు కోవిడ్, లాక్డౌన్, అగ్ని ప్రమాదం జరిగి ఇద్దరు టెక్నీషియన్ల మరణం.. ఆ తర్వాత కూడా కొన్ని అనారోగ్యాల కారణంగా కొందరు ఆర్టిస్టులు కూడా మరణించారు ఈ సినిమాకి సంబంధించి.
వాళ్లలో నెడుమూడి వేణు, వివేక్ వున్నారు. ఈ నటుల పాత్రలకు సంబంధించి కొంతమేర షూటింగ్ చేశారు. ఆ తర్వాత వారు మరణించారు. వారికి సంబంధించిన పెండింగ్ సన్నివేశాల్ని ఆధునిక టెక్నాలజీ యూజ్ చేసి చిత్రీకరించారట.
సాధారణంగా అయితే, పాత సీన్లు తీసేసి కొత్త నటుల్ని పెట్టుకుని రీ షూట్ చేయొచ్చు. కానీ, శంకర్ అండ్ టీమ్ అలా చేయలేదు. వారి గుర్తుగా ఆయా సన్నివేశాలను అలాగే వుంచేశారట. అవసరమైన మరికొన్ని సన్నివేశాలను టెక్నాలజీ సాయంతో చిత్రీకరించారట. నిజంగా ఇదో అద్భుతమే అని చెప్పాలి. ఇలాంటి ఎన్నో అద్భుతాలకు నెలవైన ‘ఇండియన్ 2’ చిత్రం ఈ నెల 12న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రపంచం మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోంది ఈ సినిమాని వీక్షించేందుకు.
తాజా వార్తలు
- కువైట్పై క్షిపణి, డ్రోన్ దాడులు..అప్రమత్తమైన వైమానిక రక్షణ వ్యవస్థ
- ఈద్ అల్ అదా డ్రా.. Dh30 మిలియన్ల విజేతను ప్రకటించిన యూఏఈ లాటరీ..!!
- ఐక్యరాజ్యసమితి చార్టర్ సూత్రాలపై చర్చ..బహ్రెయిన్ కీలక సూచనలు..!!
- 50% వరకు తగ్గింపు: యూఏఈ ప్రయాణికులకు చౌకైన టిక్కెట్లు ..!!
- ఈద్ అల్-అధా..బలి ఆచారాన్ని నిర్వహించిన కువైటీలు..!!
- తీవ్ర అస్వస్థత..ఈజిప్ట్ నుండి విమానంలో సౌదీ పౌరుల తరలింపు..!!
- 2026లో నిలకడగా ఖతార్ హాస్పిటాలిటీ సెక్టర్..!!
- ఎలిమినేటర్లో హైదరాబాద్కు బిగ్ షాక్..
- ఫైటర్ జెట్ల తయారీకి గ్రీన్ సిగ్నల్
- ఎవరెస్ట్ శిఖరం పై హైదరాబాదీ మృతి..









