‘ఇండియన్ 2’లో ఆ అద్భుతాలున్నాయట.!
- July 09, 2024
దాదాపు 30 ఏళ్ల క్రితం సంచలన విజయం అందుకున్న సినిమా ‘భారతీయుడు’. ఆ సినిమాకి ఇన్నేళ్ల తర్వాత సీక్వెల్ రూపొందించారు. ఈ సీక్వెల్ రూపొందించడానికి దాదాపు ఆరేళ్లు సమయం పట్టింది. ఇది చిన్న విషయం కాదు.
ఈ టైమ్లో టీమ్ ఎదుర్కొన్న సమస్యలు అన్నీ ఇన్నీ కావు. ఓ వైపు కోవిడ్, లాక్డౌన్, అగ్ని ప్రమాదం జరిగి ఇద్దరు టెక్నీషియన్ల మరణం.. ఆ తర్వాత కూడా కొన్ని అనారోగ్యాల కారణంగా కొందరు ఆర్టిస్టులు కూడా మరణించారు ఈ సినిమాకి సంబంధించి.
వాళ్లలో నెడుమూడి వేణు, వివేక్ వున్నారు. ఈ నటుల పాత్రలకు సంబంధించి కొంతమేర షూటింగ్ చేశారు. ఆ తర్వాత వారు మరణించారు. వారికి సంబంధించిన పెండింగ్ సన్నివేశాల్ని ఆధునిక టెక్నాలజీ యూజ్ చేసి చిత్రీకరించారట.
సాధారణంగా అయితే, పాత సీన్లు తీసేసి కొత్త నటుల్ని పెట్టుకుని రీ షూట్ చేయొచ్చు. కానీ, శంకర్ అండ్ టీమ్ అలా చేయలేదు. వారి గుర్తుగా ఆయా సన్నివేశాలను అలాగే వుంచేశారట. అవసరమైన మరికొన్ని సన్నివేశాలను టెక్నాలజీ సాయంతో చిత్రీకరించారట. నిజంగా ఇదో అద్భుతమే అని చెప్పాలి. ఇలాంటి ఎన్నో అద్భుతాలకు నెలవైన ‘ఇండియన్ 2’ చిత్రం ఈ నెల 12న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రపంచం మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోంది ఈ సినిమాని వీక్షించేందుకు.
తాజా వార్తలు
- రవీంద్ర భారతిలో ఎస్పీ బాలు విగ్రహావిష్కరణ..పాల్గొన్న ప్రముఖులు
- IPL మినీ ఆక్షన్లో కొత్త రూల్...
- జోర్డాన్ చేరుకున్న ప్రధాని మోదీ..
- కోఠి ఉమెన్స్ కాలేజీలో వేధింపులు..
- 2029 ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేస్తా: కవిత
- శ్రీమతి ఆంధ్రప్రదేశ్ 2025గా హేమలత రెడ్డి ఎంపిక…
- రవీంద్రభారతిలో ఎస్పీబాలు విగ్రహావిష్కరణ
- న్యూ ఇయర్ వేడుకలకు సీపీ సజ్జనార్ కీలక మార్గదర్శకాలు
- తామ్కీన్, SIO ఫ్రాడ్ కేసులో 10 ఏళ్ల జైలుశిక్షలు..!!
- సకాన్ హౌజింగ్ యూనిట్ల కేటాయింపు ప్రారంభం..!!







