రాష్ట్రపతి రేసులో వినపడుతున్న మరో పేరు మురళీ మనోహర్ జోషి
- June 14, 2016
వచ్చే ఏడాదితో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పదవీ కాలం ముగియనుండటంతో ఆ తర్వాత భాజపా నుంచి ఎవరు రాష్ట్రపతి అవుతారన్న అంశంపై ఆసక్తి నెలకొంది. ఇప్పటికే ఆ పదవి కోసం కొందరు భాజపా సీనియర్ల పేర్లు వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఆ రేసులో మరో భాజపా సీనియర్ నేత మురళీ మనోహర్ జోషి పేరు సైతం చేరింది. ఇప్పటికే ఆయన ఈ పదవి కోసం, ఆర్ఎస్ఎస్, భాజపా అగ్రనాయకులతో మంతనాలు జరుపుతున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం.
జోషీ ఈ విషయమై ఇప్పటికే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, పలువురు సీనియర్ భాజపా, సంఘ్ నేతల్ని కలిసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
రాష్ట్రపతి పదవి గురించి ఆయన వారితో మాట్లాడినట్లు తెలుస్తోంది. ఈ విషయంలో సంఘ్ నిర్ణయం సైతం కీలక పాత్ర పోషించనుంది. వారి నిర్ణయం ప్రకారమే ప్రధాని మోదీ, భాజపా జాతీయాధ్యక్షుడు అమిత్షాలు కలిసి తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ విషయంలో ఆర్ఎస్ఎస్ నేత దేవేంద్ర స్వరూప్ జోషీకి మద్దతుగా నిలుస్తున్నట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..







