రాష్ట్రపతి రేసులో వినపడుతున్న మరో పేరు మురళీ మనోహర్ జోషి
- June 14, 2016
వచ్చే ఏడాదితో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పదవీ కాలం ముగియనుండటంతో ఆ తర్వాత భాజపా నుంచి ఎవరు రాష్ట్రపతి అవుతారన్న అంశంపై ఆసక్తి నెలకొంది. ఇప్పటికే ఆ పదవి కోసం కొందరు భాజపా సీనియర్ల పేర్లు వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఆ రేసులో మరో భాజపా సీనియర్ నేత మురళీ మనోహర్ జోషి పేరు సైతం చేరింది. ఇప్పటికే ఆయన ఈ పదవి కోసం, ఆర్ఎస్ఎస్, భాజపా అగ్రనాయకులతో మంతనాలు జరుపుతున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం.
జోషీ ఈ విషయమై ఇప్పటికే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, పలువురు సీనియర్ భాజపా, సంఘ్ నేతల్ని కలిసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
రాష్ట్రపతి పదవి గురించి ఆయన వారితో మాట్లాడినట్లు తెలుస్తోంది. ఈ విషయంలో సంఘ్ నిర్ణయం సైతం కీలక పాత్ర పోషించనుంది. వారి నిర్ణయం ప్రకారమే ప్రధాని మోదీ, భాజపా జాతీయాధ్యక్షుడు అమిత్షాలు కలిసి తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ విషయంలో ఆర్ఎస్ఎస్ నేత దేవేంద్ర స్వరూప్ జోషీకి మద్దతుగా నిలుస్తున్నట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- ఆపిల్ కు కొత్త సీఈఓ జాన్ టెర్నస్
- హోర్ముజ్ జలసంధి పై ఇరాన్ పట్టు: గల్ఫ్ దేశాల ఆందోళనలు
- మే 24 వరకు భారత విమానయాన సంస్థల పై పాక్ నిషేధం
- విదేశీ కార్మికుల స్థానంలో బహ్రెయిన్ లను నియమించండి..!!
- 2027 నుండి కొత్త డాక్టర్లకు లైసెన్సింగ్ పరీక్షలు..!!
- సౌదీలో 14 రిక్రూటింగ్ ఆఫీసులు సీజ్..!!
- కువైట్ నటి హయత్ అల్-ఫహద్ కన్నుమూత..!!
- రియల్ ఎస్టేట్ బ్రోకరేజ్ చట్ట సవరణపై సమీక్ష..!!
- యూఏఈలో భారత పాస్పోర్ట్, వీసా సేవలు..అల్హింద్ కు కాంట్రాక్ట్..!!
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..









