రికార్డు..QR3.47bnకి ఇ-కామర్స్ లావాదేవీలు
- July 12, 2024
దోహా: ఖతార్లో ఇ-కామర్స్ మరియు పాయింట్ ఆఫ్ సేల్ (పిఓఎస్) లావాదేవీలు జూన్లో అద్భుతమైన వృద్ధిని సాధించాయని ఖతార్ సెంట్రల్ బ్యాంక్ (క్యూసిబి) వెల్లడించింది. జూన్ 2024లో ఇ-కామర్స్ లావాదేవీల పరిమాణం 7.26 మిలియన్లకు చేరుకుందని, QR3.47bn విలువతో ఇ-కామర్స్ లావాదేవీల విలువలో సంవత్సరానికి 40 శాతం పెరుగుదల నమోదయిందని తన సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా వెల్లడించింది. జూన్ 2023, 2022లో ఖతార్లో ఇ-కామర్స్ లావాదేవీల పరిమాణం వరుసగా 5.09 మిలియన్లు, 4.37 మిలియన్లుగా ఉంది. ఖతార్లో పాయింట్ ఆఫ్ సేల్ (పీఓఎస్) లావాదేవీలు కూడా ఈ ఏడాది జూన్లో పెరిగాయి. POS లావాదేవీల విలువ జూన్ 2023లో QR7.54bnతో పోలిస్తే జూన్ 2024లో QR7.78bn, జూన్ 2022లో QR6.59bn వరుసగా 3.18 శాతం మరియు 18.05 శాతం పెరిగిందని ఖతార్ సెంట్రల్ బ్యాంక్ (QCB) డేటా వెల్లడించింది.
పాయింట్ ఆఫ్ సేల్ లావాదేవీల పరిమాణం ఈ ఏడాది జూన్లో 34.83 మిలియన్లుగా ఉంది. గత ఏడాది జూన్లో ఇది 31.06 మిలియన్లు, జూన్ 2022లో 23.82 మిలియన్లు.. వరుసగా 12.13 శాతం మరియు 46.22 శాతం పెరిగాయి. ఖతార్లో పాయింట్-ఆఫ్-సేల్ పరికరాల సంఖ్య జూన్ 2023లో 66,775, జూన్ 2022లో 51,874తో పోలిస్తే ఈ ఏడాది జూన్లో మొత్తం 73,979గా నమోదు అయినట్టు QCB డేటా పేర్కొంది.
ఈ ఏడాది జూన్లో ఖతార్లో యాక్టివ్ డెబిట్ కార్డ్ల సంఖ్య మొత్తం 2,294,161 అని డేటా తెలిపింది. క్రెడిట్ కార్డ్లు మరియు ప్రీపెయిడ్ కార్డ్లు మొత్తం జూన్ 2024లో వరుసగా 723,199 మరియు 713,434 గా ఉన్నాయి. QCB ఇటీవల హిమ్యాన్ డెబిట్ కార్డ్ను కూడా ప్రారంభించిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- ఎలిమినేటర్లో హైదరాబాద్కు బిగ్ షాక్..
- ఫైటర్ జెట్ల తయారీకి గ్రీన్ సిగ్నల్
- ఎవరెస్ట్ శిఖరం పై హైదరాబాదీ మృతి..
- ఏపీ ప్రభుత్వంతో BYST ఒప్పందం!
- ప్రధాని మోదీతో ముగిసిన సీఎం విజయ్ సమావేశం
- ఈద్ అల్-అధా శుభాకాంక్షలు తెలిపిన భారత రాయబారి పరామిత త్రిపాఠి..!!
- సుల్తాన్ ఖబూస్ మస్జీదులో ఈద్ ప్రార్థనలు చేసిన సుల్తాన్..!!
- మినాలో భద్రతను సమీక్షించిన ఇంటీరియర్ మినిస్టర్..!!
- లుసైల్ ప్యాలెస్లో ఈద్ అల్-అధా వేడుకల్లో పాల్గొన్న అమీర్..!!
- మనామా సూక్లో ఈద్ సందడి..జోరుగా సాగిన కొనుగోళ్లు..!!









