ఇరాక్ లో రోడ్డు ప్రమాదం..బహ్రెయిన్ కు రానున్న బాధితులు..!
- July 13, 2024
మనామా: ఇరాక్లో విషాదకరమైన కారు ప్రమాదంలో చిక్కుకున్న బహ్రెయిన్ కుటుంబం వచ్చే ఆదివారం తిరిగి వస్తారని భావిస్తున్నారు. కొంతమంది కుటుంబ సభ్యులు ఇప్పటికే కోలుకుని గల్ఫ్ ఎయిర్ విమానంలో చేరుకోనున్నారు. ఈ ప్రమాదం జూన్ 2024లో ఇరాక్ నగరమైన నసిరియా సమీపంలోని అంతర్జాతీయ రహదారిపై జరిగింది. ఇందులో ఒక కుటుంబ సభ్యుడు ఫౌజియా అల్ నజ్జర్ ప్రాణాలు కోల్పోయారు. సదరు కుటుంబం ఇరాక్లో ప్రయాణిస్తుండగా వారి వాహనం ప్రమాదానికి గురైంది. మరో ఆరుగురు కుటుంబ సభ్యులు గాయపడ్డారు. వారందరూ నసిరియాలోని ఆసుపత్రిలో చికిత్స పొందారు. గాయపడిన వారిలో 15 ఏళ్ల బాలుడి పరిస్థితి విషమంగా ఉంది. స్థానిక ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో చికిత్స పొందుతున్నాడు. కుటుంబంలోని ఇద్దరు మహిళలు ప్రమాదంలో ఫ్రాక్చర్లకు శస్త్రచికిత్స చేయించుకుని కోలుకుంటున్నారు. గాయపడిన వారిలో చాలా మంది బహ్రెయిన్కు తిరిగి రావడానికి ఎదురుచూస్తున్నారని అధికార వర్గాలు ధృవీకరించాయి. తమకు అండగా నిలిచిన ఇరాక్లోని బహ్రెయిన్ రాయబార కార్యాలయానికి కృతజ్ఞతలు తెలిపారు.
తాజా వార్తలు
- సౌదీ నుంచి క్షేమంగా బయలుదేరిన 59 మంది తెలుగు ప్రవాసులు
- ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్ రాజీనామా
- 'మేము ఇక్కడ సురక్షితం'-యుద్ధ సమయంలోనూ ఇరానియన్లకు అండగా నిలుస్తున్న యూఏఈ ప్రజలు!
- విదేశాల్లో చిక్కుకుపోతే కంపెనీ జీతం ఆపేయవచ్చా?
- యూఏఈలో కూరగాయల ధరల పెరుగుదల తాత్కాలికమే
- అమరావతి స్పోర్ట్స్ సిటీపై సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు!
- తెలంగాణలో సాయంత్రం పూట బీటెక్ కోర్సులు
- అన్ని రకాల డ్రోన్ల పై యూఏఈ నిషేధం..!!
- 684 మంది ఇంజనీర్లకు SR1.6 మిలియన్ల ఫైన్స్..!!
- 2 ఇండిగో విమానాలు దారి మళ్లింపు.. ప్రయాణికులు అసహనం..!!









