ఇరాక్ లో రోడ్డు ప్రమాదం..బహ్రెయిన్ కు రానున్న బాధితులు..!
- July 13, 2024
మనామా: ఇరాక్లో విషాదకరమైన కారు ప్రమాదంలో చిక్కుకున్న బహ్రెయిన్ కుటుంబం వచ్చే ఆదివారం తిరిగి వస్తారని భావిస్తున్నారు. కొంతమంది కుటుంబ సభ్యులు ఇప్పటికే కోలుకుని గల్ఫ్ ఎయిర్ విమానంలో చేరుకోనున్నారు. ఈ ప్రమాదం జూన్ 2024లో ఇరాక్ నగరమైన నసిరియా సమీపంలోని అంతర్జాతీయ రహదారిపై జరిగింది. ఇందులో ఒక కుటుంబ సభ్యుడు ఫౌజియా అల్ నజ్జర్ ప్రాణాలు కోల్పోయారు. సదరు కుటుంబం ఇరాక్లో ప్రయాణిస్తుండగా వారి వాహనం ప్రమాదానికి గురైంది. మరో ఆరుగురు కుటుంబ సభ్యులు గాయపడ్డారు. వారందరూ నసిరియాలోని ఆసుపత్రిలో చికిత్స పొందారు. గాయపడిన వారిలో 15 ఏళ్ల బాలుడి పరిస్థితి విషమంగా ఉంది. స్థానిక ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో చికిత్స పొందుతున్నాడు. కుటుంబంలోని ఇద్దరు మహిళలు ప్రమాదంలో ఫ్రాక్చర్లకు శస్త్రచికిత్స చేయించుకుని కోలుకుంటున్నారు. గాయపడిన వారిలో చాలా మంది బహ్రెయిన్కు తిరిగి రావడానికి ఎదురుచూస్తున్నారని అధికార వర్గాలు ధృవీకరించాయి. తమకు అండగా నిలిచిన ఇరాక్లోని బహ్రెయిన్ రాయబార కార్యాలయానికి కృతజ్ఞతలు తెలిపారు.
తాజా వార్తలు
- ఎలిమినేటర్లో హైదరాబాద్కు బిగ్ షాక్..
- ఫైటర్ జెట్ల తయారీకి గ్రీన్ సిగ్నల్
- ఎవరెస్ట్ శిఖరం పై హైదరాబాదీ మృతి..
- ఏపీ ప్రభుత్వంతో BYST ఒప్పందం!
- ప్రధాని మోదీతో ముగిసిన సీఎం విజయ్ సమావేశం
- ఈద్ అల్-అధా శుభాకాంక్షలు తెలిపిన భారత రాయబారి పరామిత త్రిపాఠి..!!
- సుల్తాన్ ఖబూస్ మస్జీదులో ఈద్ ప్రార్థనలు చేసిన సుల్తాన్..!!
- మినాలో భద్రతను సమీక్షించిన ఇంటీరియర్ మినిస్టర్..!!
- లుసైల్ ప్యాలెస్లో ఈద్ అల్-అధా వేడుకల్లో పాల్గొన్న అమీర్..!!
- మనామా సూక్లో ఈద్ సందడి..జోరుగా సాగిన కొనుగోళ్లు..!!









