ఇరాక్ లో రోడ్డు ప్రమాదం..బహ్రెయిన్ కు రానున్న బాధితులు..!
- July 13, 2024
మనామా: ఇరాక్లో విషాదకరమైన కారు ప్రమాదంలో చిక్కుకున్న బహ్రెయిన్ కుటుంబం వచ్చే ఆదివారం తిరిగి వస్తారని భావిస్తున్నారు. కొంతమంది కుటుంబ సభ్యులు ఇప్పటికే కోలుకుని గల్ఫ్ ఎయిర్ విమానంలో చేరుకోనున్నారు. ఈ ప్రమాదం జూన్ 2024లో ఇరాక్ నగరమైన నసిరియా సమీపంలోని అంతర్జాతీయ రహదారిపై జరిగింది. ఇందులో ఒక కుటుంబ సభ్యుడు ఫౌజియా అల్ నజ్జర్ ప్రాణాలు కోల్పోయారు. సదరు కుటుంబం ఇరాక్లో ప్రయాణిస్తుండగా వారి వాహనం ప్రమాదానికి గురైంది. మరో ఆరుగురు కుటుంబ సభ్యులు గాయపడ్డారు. వారందరూ నసిరియాలోని ఆసుపత్రిలో చికిత్స పొందారు. గాయపడిన వారిలో 15 ఏళ్ల బాలుడి పరిస్థితి విషమంగా ఉంది. స్థానిక ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో చికిత్స పొందుతున్నాడు. కుటుంబంలోని ఇద్దరు మహిళలు ప్రమాదంలో ఫ్రాక్చర్లకు శస్త్రచికిత్స చేయించుకుని కోలుకుంటున్నారు. గాయపడిన వారిలో చాలా మంది బహ్రెయిన్కు తిరిగి రావడానికి ఎదురుచూస్తున్నారని అధికార వర్గాలు ధృవీకరించాయి. తమకు అండగా నిలిచిన ఇరాక్లోని బహ్రెయిన్ రాయబార కార్యాలయానికి కృతజ్ఞతలు తెలిపారు.
తాజా వార్తలు
- ఖతార్లో ప్రజలకు పోలీసుల సూచనలు..QID వెంట ఉంచుకోవాలి
- దుబాయ్ బతుకమ్మ వేడుకలకు కేటీఆర్కు ఆహ్వానం
- దుబాయ్ పోలీసుల్లో 36 ఆర్పీఏ రోబోలు..
- తెలంగాణలో కొత్త క్రిమినల్ చట్టాల అమలు పై NCRB డైరెక్టర్ సమీక్ష
- ఏపీలో వేసవిని తలపిస్తున్న ఎండలు
- కల్తీ మద్యం తాగి 14 మంది మృతి..
- ISRO ప్రైవేటీకరణపై క్లారిటీ ఇవ్వండి
- సౌదీ-మలేషియా జాయింట్ ఆపరేషన్.. డ్రగ్ నెట్వర్క్ బస్ట్..!!
- హవల్లీ, ముబారక్ అల్-కబీర్ ప్రాంతాల్లో పలుచోట్ల పవర్ కట్..!!
- కతారా హాస్పిటాలిటీ.. హోటళ్లు, రిసార్టుల్లో 40 శాతం వరకు ఆదా..!!







