తెరుచుకున్న రత్న భాండాగారం తలుపులు, అధికారికంగా ప్రకటించిన ప్రభుత్వం
- July 14, 2024
ఒడిశా: ఒడిశాలోని పూరీ జగన్నాథుడి రత్న భాండాగారం తెరుచుకుంది. మధ్యాహ్నం 1.28 గంటలకు ప్రత్యేక పూజల నిర్వహించి కలెక్టర్, హైలెవల్ కమిటీ పర్యవేక్షణలో రహస్య గది తలుపులను తెరిచారు. జగన్నాథుడి సేవలకు అంతరాయం కలగకుండా తలుపులను తెరిచారు. 11మంది ఈ ప్రక్రియలో పాల్గొన్నట్లు అధికారులు తెలిపారు. 46ఏళ్ల క్రితం అంటే 1978లో చివరిసారిగా దీన్ని తెరిచారు.రత్నభండార్ లోకి కమిటీ సభ్యులు ప్రవేశించారు. మొత్తం ప్రక్రియను కమిటీ సభ్యులు వీడియో తీస్తున్నారు. స్వామివారి నగలు, ఆభరణాలు తరలించేందుకు బాక్సులను అధికారులు సిద్ధం చేశారు. కాసేపట్లో రత్న భాండాగారంలోని ఆభరణాల లెక్కింపు, తదితర ప్రక్రియను చేపట్టనున్నారు. 1978లో సంపదను లెక్కించడానికి 72 రోజులు సమయం పట్టింది.
తాజా వార్తలు
- షేక్ జాబర్ అల్-అహ్మద్ అల్-సబా స్ట్రీట్ మూసివేత..!!
- E311లో ప్రమాదం.. డ్రైవర్ స్పృహ కోల్పోవడమే కారణం..!!
- వేటగాళ్ల నుండి సీగల్స్ కు విముక్తి..!!
- షురా కౌన్సిల్ లో లాంగ్ టెర్మ్ కల్చరల్ వీసాపై చర్చ..!!
- ఖతార్ లో త్వరలో ఇళ్ల వద్దకే రేషన్ డెలివరీ..!!
- రియాద్లో ఆరుగురు పాకిస్తానీలు అరెస్టు..!!
- దుబాయ్లో ఘనంగా శతావధాన కార్యక్రమం
- విద్యార్థుల కోసం పార్ట్నర్ షిప్ సమ్మిట్: సీఎం చంద్రబాబు
- భారత్లో 2.5 లక్షల టాటా ఎలక్ట్రిక్ కార్లు
- ఫ్లెమింగో రెస్టారెంట్ తాత్కాలికంగా మూసివేత..!!







