DXB టెర్మినల్ 3 సందర్శించిన షేక్ మొహమ్మద్
- July 14, 2024
యూఏఈ: దుబాయ్ ఇంటర్నేషనల్ (DXB) టెర్మినల్ 3లో జరుగుతున్న పనుల పురోగతిని UAE వైస్ ప్రెసిడెంట్ మరియు ప్రధాన మంత్రి, దుబాయ్ పాలకుడు షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ పరిశీలించారు.షేక్ మహ్మద్ వ్యక్తిగతంగా విమానాశ్రయంలోని కార్యకలాపాలను పరిశీలించారు. బయలుదేరే మరియు వచ్చే ప్రయాణీకులకు అందిస్తున్న సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. బయలుదేరే మరియు వచ్చే ప్రయాణీకులకు అందించిన నాణ్యమైన సౌకర్యాలపై విమానాశ్రయ అధికారులు వివరించారు. టెర్మినల్ 3లో జరిగిన అభివృద్ధిని షేక్ మొహమ్మద్ అభినందించారు.
2024 మొదటి త్రైమాసికంలో ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగి 23 మిలియన్లకు చేరుకుంది. గత సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే ఇది 8.4% పెరిగింది.షేక్ మహమ్మద్తో పాటు దుబాయ్లోని స్టేట్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్ డైరెక్టర్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ తలాల్ హుమైద్ బెల్హౌల్ కూడా ఉన్నారు.
తాజా వార్తలు
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!







