DXB టెర్మినల్ 3 సందర్శించిన షేక్ మొహమ్మద్
- July 14, 2024
యూఏఈ: దుబాయ్ ఇంటర్నేషనల్ (DXB) టెర్మినల్ 3లో జరుగుతున్న పనుల పురోగతిని UAE వైస్ ప్రెసిడెంట్ మరియు ప్రధాన మంత్రి, దుబాయ్ పాలకుడు షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ పరిశీలించారు.షేక్ మహ్మద్ వ్యక్తిగతంగా విమానాశ్రయంలోని కార్యకలాపాలను పరిశీలించారు. బయలుదేరే మరియు వచ్చే ప్రయాణీకులకు అందిస్తున్న సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. బయలుదేరే మరియు వచ్చే ప్రయాణీకులకు అందించిన నాణ్యమైన సౌకర్యాలపై విమానాశ్రయ అధికారులు వివరించారు. టెర్మినల్ 3లో జరిగిన అభివృద్ధిని షేక్ మొహమ్మద్ అభినందించారు.
2024 మొదటి త్రైమాసికంలో ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగి 23 మిలియన్లకు చేరుకుంది. గత సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే ఇది 8.4% పెరిగింది.షేక్ మహమ్మద్తో పాటు దుబాయ్లోని స్టేట్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్ డైరెక్టర్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ తలాల్ హుమైద్ బెల్హౌల్ కూడా ఉన్నారు.
తాజా వార్తలు
- అల్ సువైఖ్లో ఇద్దరు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- మాల్స్ పార్కింగ్ ఏరియాల్లో గాలి నాణ్యతపై కీలక అప్డేట్..!!
- కంపెనీలు ఉద్యోగుల తొలగింపులను నివారించవచ్చా?
- మహమ్మారి సమయంలో జన్మించిన పిల్లలకు అడ్మిషన్లు..!!
- గల్ఫ్ పెట్రో కెమికల్ ఇండస్ట్రీస్ కంపెనీ యూనిట్ల పై దాడులు..!!
- అమరావతికి చట్టబద్ధత: సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్ఆర్ఐ టీడీపీ సంబరాలు
- కువైట్ ప్రభుత్వ మంత్రిత్వ శాఖల సముదాయం పై డ్రోన్ దాడి
- తెలంగాణ ప్రజలకు అలెర్ట్..
- ఏపీ హై కోర్ట్: విదేశాలకు వెళ్లిన అర్చకులు గర్భగుడిలోకి వెళ్లకూడదు
- ఈస్టర్ శుభాకాంక్షలు తెలిపిన వైఎస్ జగన్









